హైదరాబాద్ లోని రెస్టారెంట్లు, హోటళ్ల ఐ కొరడా విసిరారు పోలీసులు.సతామ్రాయ్లోని బాలాజీ ఇండస్ట్రీ సమీపంలోని ఒక షాపులో కల్తీ ఆహార పదార్థాలను పట్టుకున్నారు. సింథటిక్ రంగులను స్వాధీనం చేసుకున్నారు.
ఎరుపు 250 గ్రాములు, ఆకుపచ్చ 400 గ్రాములు, తెలుపు 150 గ్రాములు, నీరు కలిపిన ఫుడ్ కలర్ 5 లీటర్లు, నకిలీ పసుపు పొడి 35 కిలోలు, కెచప్తో సహా గడువు ముగిసిన, కల్తీ చేసిన ఆహార పదార్థాలను సీజ్ చేశారు.
కల్తీ చిల్లి సాస్ 44 లీటర్లు, కల్తీ టొమాటో సాస్ 7 లీటర్లు స్వాధీనం చేసుకున్నారు. కల్తీ ఆహార పదార్థాలు తయారు చేస్తున్న రాజేష్ ఉపాధ్యాయ, శ్రీరామ్ తివారీని అరెస్ట్ చేశారు. వారిపై 223, 274, 275 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు
.

