Vivek: 42% రిజర్వేషన్ కి సుప్రీం ఒప్పుకుంటలేదు

Vivek: స్థానిక ఎన్నికల రిజర్వేషన్లను 42 శాతం వరకూ పెంచాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి వివేక్ తెలిపారు. అయితే ఈ ప్రతిపాదనకు సుప్రీంకోర్టు అనుమతి ఇవ్వకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పారు.

సర్పంచ్ ఎన్నికల్లో పార్టీ గుర్తు ఇవ్వబడదని మంత్రి స్పష్టం చేశారు. రిజర్వేషన్లను 42 శాతానికి పెంచాలనే ప్రభుత్వ నిర్ణయం కేబినెట్‌లో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు.

స్థానిక సంస్థల ఎన్నికలు రోస్టర్ సిస్టమ్ ప్రకారం మాత్రమే నిర్వహించబడతాయని వివేక్ అన్నారు. ఈ ఎన్నికల్లో మంత్రులు, కలెక్టర్‌లు మరియు ఇతర ఉన్నతాధికారుల జోక్యం ఉండదని స్పష్టం చేశారు.

ప్రజలు స్థానిక ఎన్నికల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని పేర్కొన్న మంత్రి వివేక్, ఈ నెల 25న జరుగనున్న కేబినెట్ సమావేశంలో దీనిపై ముఖ్యమైన నిర్ణయం ఉండనున్నట్లు వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *