Puri-Vijay Sethupathi: ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్, తమిళ స్టార్ విజయ్ సేతుపతి కాంబినేషన్లో రూపొందుతున్న పాన్-ఇండియా చిత్రం హైదరాబాద్లో షూటింగ్ ప్రారంభించింది. ఈ రోజు నుంచి మొదలైన ఈ షెడ్యూల్లో విజయ్ సేతుపతి, సంయుక్త మీనన్లతో కీలక టాకీ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. నిరంతర షూటింగ్తో ఈ చిత్రాన్ని వేగంగా పూర్తి చేసేందుకు యూనిట్ ప్లాన్ చేసింది. పూరి కనెక్ట్స్ బ్యానర్పై పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్ నిర్మిస్తున్న ఈ సినిమాలో టబు, దునియా విజయ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
Also Read: Prabhas vs Ranveer: ప్రభాస్ vs రణ్వీర్.. బాలీవుడ్లో బిగ్ ఫైట్?
సంయుక్త పాత్ర సినిమా కథలో భావోద్వేగంతో కూడిన కీలకమైనదిగా ఉంటుందని తెలుస్తోంది. హైదరాబాద్, చెన్నైలో లొకేషన్లను ఎంపిక చేసిన బృందం, ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేయనుంది. యాక్షన్, డ్రామాతో కూడిన ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటుందని టీమ్ ధీమాగా ఉంది. త్వరలో ఇతర వివరాలను అధికారికంగా ప్రకటించనున్నారు.
AND IT BEGINS 💥💥💥
The raw and real journey of #PuriSethupathi begins on the sets today in Hyderabad ❤️🔥
Major talkie portions featuring Makkalselvan @VijaySethuOffl and fierce @iamsamyuktha_ are being canned in this packed schedule and will have a continuous shoot🔥
— Puri Connects (@PuriConnects) July 7, 2025