Telangana: మ‌హిళా ఎన్యుమ‌రేట‌ర్ల‌కు హైద‌రాబాద్‌లో చేదు అనుభ‌వం

Telangana: స‌మ‌గ్ర కుటుంబ సర్వే కోసం హైద‌రాబాద్‌లో ఓ ఇంటికి వెళ్లిన ఇద్ద‌రు మ‌హిళా ఎన్యుమ‌రేటర్ల‌కు చేదు అనుభ‌వం ఎదురైంది. ఆ ఇద్ద‌రిపై ఆ కుటుంబం త‌మ పైత్యాన్ని చూపింది. బంజారాహిల్స్‌లోని అరోరా కాల‌నీలో ఓ ఇంటికి ఎన్యుమ‌రేట‌ర్లైన అపురూప‌, ర‌మ్య‌శ్రీ వివ‌రాల సేక‌ర‌ణ కోసం వెళ్లారు. ఆ ఇంటిలోని వెళ్ల‌గానే ఆ ఇంటి య‌జ‌మానులు క్కుక్క‌ల‌ను వ‌దిలారు. అంతేగాకుండా వారితో దుర్భాష‌లాడారు. స‌ర్వే చేయ‌కుండా అడ్డుకున్నారు.

Telangana: ఆ ఇద్ద‌రు మ‌హిళా ఎన్యుమ‌రేట‌ర్లు స‌మీపంలోని గ‌తి పాఠ‌శాల‌లో ఉపాధ్యాయులుగా ప‌నిచేస్తున్నారు. వారికి ఇలాంటి చేదు అనుభ‌వం ఎదురు కావ‌డంతో హైద‌రాబాద్ న‌గ‌రంలో స‌ర్వేలో పాల్గొనే ఇత‌ర ఎన్యుమ‌రేట‌ర్లు భ‌యాందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. త‌మ‌కు ర‌క్ష‌ణ క‌ల్పించాల‌ని ప్ర‌భుత్వాన్ని కోరుతున్నారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *