Dead body victimisation : అసలు ఏమైంది ఈ సమాజానికి. కామంతో …ఏమి చేస్తున్నామో తెలియక ..అత్యంత దారుణంగా ప్రవర్తిస్తున్నారు. చిన్నారి బాలిక చనిపోయింది. తమ బిడ్డ చనిపోయింది అన్న బాధ మరవకముందే …ఆ తల్లితండ్రులకు అంతకంటే పెద్ద కష్టం మరొకటి వచ్చింది. అసలు ఎవరు ఊహించని విధంగా …ఈ సంఘటన జరిగింది. ఎలా చెప్పాలో కూడా తెలియడం లేదు. ఎందుకంటే రోజు రోజుకి జరుగుతున్నా దారుణాలు ఒకవైపు ఐతే..ఈ ఒక్క సంఘటన ఒక ఎత్తు. చి చి నిచ్చుల్లారా …భూమి మీద అనవసరంగా పుట్టారు కాదు రా.
జార్ఖండ్ రాష్ట్రంలోని రాజ్గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ బాలిక మృతదేహాన్ని సమాధి నుంచి బయటకు తీసి అత్యాచారం చేసిన ఘటన వెలుగు చూసింది. ఘటనకు సంబంధించి అందిన సమాచారం ప్రకారం, రాజ్గంజ్ ప్రాంతంలోని శ్మశానవాటికలో బాలిక మృతదేహాన్ని ఖననం చేశారు. మృతదేహాన్ని సమాధి నుంచి బయటకు తీసిన తర్వాత ఇద్దరు బాలురు అత్యాచారానికి పాల్పడ్డారు. అత్యాచార ఘటన వెలుగులోకి వచ్చిన వెంటనే కొన్ని వర్గాలకు చెందిన ప్రజలు ఆగ్రహంతో ఊగిపోయారు. దీంతో కోపోద్రిక్తులైన ప్రజలు వీరంగం సృష్టించడం ప్రారంభించారు. ఘటనపై సమాచారం అందిన వెంటనే రాజ్గంజ్ పోలీసులు ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకున్నారు. వారిపై విచారణ ప్రారంభించారు.
ఈ విషయంలో సదరు ఇద్దరు నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటే తప్ప తమ ఆగ్రహం ఆగదని నిరసనకారులు తెలపగా.. పోలీసులు అందరినీ శాంతింపజేసి ఇంటికి పంపించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనకు పాల్పడిన నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆగ్రహించిన ప్రజలకు పోలీసులు హామీ ఇచ్చారు.
ఈ ఘటనపై ఎస్డిపిఓ పురుషోత్తం సింగ్ ప్రకటన కూడా చేసారు. రాజ్గంజ్ పోలీస్ స్టేషన్లో ఉన్న సమాధిని తారుమారు చేసినట్లు సమాచారం అందిందని ఆయన అన్నారు. దీని తర్వాత సంఘటనా స్థలానికి చేరుకున్నామని, అక్కడికి వెళ్లి చూడగా ఒక సమాధి నుంచి కొద్దిగా మట్టిని తొలగించారని, అయితే మృతదేహం సమాధిలోనే ఉందని తెలిపారు. అయితే నిరసనకారులు మృతదేహాన్ని తారుమారు చేశారని ఆరోపించారని, ఆ విషయం పై దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.