TTD General Meeting: తిరుమలలో టీటీడీ పాలక మండలి అత్యవసరంగా సమావేశమైంది. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో, ధర్మప్రచార పరిషత్ కార్యక్రమాలపై ప్రత్యేకంగా చర్చ జరిగింది.
శ్రీవారి వైభవం మరింత విస్తరించేందుకు, సనాతన ధర్మాన్ని ప్రజలలోకి తీసుకెళ్లేందుకు చేపట్టాల్సిన చర్యలపై సుదీర్ఘంగా సమాలోచనలు జరిగాయి. భక్తుల ఆధ్యాత్మిక శ్రేయస్సు కోసం టీటీడీ చేపట్టబోయే పలు కొత్త కార్యక్రమాలకు ఈ భేటీలో ఆమోదం అభించనుంది.