Tirumala

Tirumala: తిరుమల వెళ్లే భక్తులకు అలర్ట్..టీటీడీ కీలక నిర్ణయం.. మే నుంచి అమలు

Tirumala: తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి దర్శనానికి రావాలనుకునే భక్తులకు ఒక కీలక సమాచారం. వేసవి సెలవులు నేపథ్యంలో భక్తుల రద్దీ భారీగా పెరగనుండటంతో, తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) మే 1వ తేదీ నుంచి జులై 15వ తేదీ వరకు ప్రత్యేక నిబంధనలు అమలు చేయబోతోంది.

సిఫార్సు లేఖలకు గుడ్‌బై!
ఈ కాలంలో సిఫార్సు లేఖల ద్వారా దర్శనం అవకాశాన్ని టీటీడీ పూర్తిగా రద్దు చేసింది. ప్రజాప్రతినిధులు, టీటీడీ బోర్డు సభ్యులు వంటి వారందరికీ ఇది వర్తిస్తుంది. ప్రోటోకాల్ విఐపీలకు మాత్రమే బ్రేక్ దర్శనం సౌకర్యం కొనసాగించనున్నారు.
భక్తులందరికీ సమానంగా దర్శనం అవకాశాన్ని అందించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ ప్రకటించింది.

బ్రేక్ దర్శన వేళల్లో మార్పు
ఇప్పటి వరకు ఉదయం తరువాత ప్రారంభమయ్యే బ్రేక్ దర్శనాలను, మే 1 నుంచి ఉదయం 6 గంటలకు ప్రారంభించనున్నారు. దీనివల్ల సాధారణ దర్శనానికి వచ్చే భక్తులు ఎక్కువ సమయం ఆలయంలో గడపకుండా త్వరగా దర్శనం చేసుకునే అవకాశం లభించనుంది.

ప్రత్యేక వేడుకలు మరియు సేవల రద్దు
మే 6 నుండి మే 8 వరకు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు జరుగుతుండటంతో, ఆ మూడు రోజులు ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకరణ సేవలను టీటీడీ రద్దు చేసింది.

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
ప్రస్తుతం తిరుమలలో భక్తుల సంఖ్య భారీగా పెరిగింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ అవసరం లేకుండా నేరుగా దర్శనం జరుగుతోంది. ఆదివారం ఒక్క రోజే 78,177 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. హుండీ ద్వారా రూ.3.53 కోట్లు ఆదాయం వచ్చిందని టీటీడీ అధికారులు తెలిపారు.

అధికారుల హెచ్చరిక
వేసవి సెలవుల్లో రద్దీ మరింత పెరిగే అవకాశం ఉన్నందున, భక్తులు ముందుగా ప్రణాళిక చేసుకొని దర్శనానికి రావాలని టీటీడీ సూచించింది. శ్రీవారి మెట్టు మార్గం, క్యూలైన్లలో చిన్న పిల్లలతో వచ్చిన భక్తులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. పోలీస్ విభాగం కూడా హై అలర్ట్ ప్రకటించి, బస్టాండ్లు, హోటళ్లు, ఘాట్ రోడ్ల వద్ద కట్టుదిట్టమైన తనిఖీలు నిర్వహిస్తోంది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Air India Flight in Thailand: థాయ్‌లాండ్‌లో చిక్కుకుపోయిన విమాన ప్రయాణీకులు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *