Miryalaguda: నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం కొత్తగూడెం గ్రామంలో విషాదకకరమైన ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన వాణి అనే యువతి ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది. మిర్యాలగూడలోని ఓ కిరాణా షాపులో వాణి పనిచేస్తుంది.
గత కొద్దిరోజులుగా అదే గ్రామానికి చెందిన సతీష్ అనే వ్యక్తి అసభ్యకర మెసేజ్లు పంపుతూ వేధిస్తుండడంతో మనస్తాపానికి గురైన వాణి.. ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు కుటుంబ సభ్యులు రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
బాధితుల ఫిర్యాదుతో ఘటనా స్ధలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని, పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని మిర్యాలగూడ ప్రభుత్వా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టనున్నట్లు పోలీసులు తెలిపారు.