Adivi Sesh: యశ్ టాక్సిక్, రణ్వీర్ ధురంధర్ సీక్వెల్తో పాటు అడివి శేష్ డెకాయిట్ ఒకే రోజు విడుదల కాబోతోంది. ఈ భారీ క్లాష్ పై అడివి శేష్ ధీమాగా స్పందించాడు. తన సినిమాను గోల్డ్ ఫిష్గా పేర్కొన్నాడు. ఈ విషయం గురించి పూర్తి వివరాలు చూద్దాం.
Also Read: Dhurandhar: ధురంధర్ ఓటీటీ డీల్కు షాకింగ్ ధర?
రాకింగ్ స్టార్ యశ్ నటిస్తున్న టాక్సిక్, బాలీవుడ్లో సంచలనం రేపుతున్న ధురంధర్ సీక్వెల్ ఒకే రోజు విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఇదే తేదీన టాలీవుడ్ యంగ్ హీరో అడివి శేష్ నటించిన డెకాయిట్ కూడా రాబోతోంది. వచ్చే ఏడాది మార్చి 19న ఈ మూడు సినిమాలు పోటీ పడనున్నాయి. ఈ భారీ క్లాష్ పై చాలా మంది ఆందోళన వ్యక్తం చేశారు. కానీ డెకాయిట్ టీజర్ లాంచ్ ఈవెంట్లో అడివి శేష్ ధీమాగా స్పందించాడు. గతంలో మేజర్ సినిమాకు కూడా విక్రమ్, సామ్రాట్ పృథ్వీరాజ్తో క్లాష్ జరిగిందని గుర్తుచేశాడు. ఇప్పుడు కూడా అదే చెబుతున్నానని అన్నాడు. ఒక సముద్రంలో ఎన్నో పెద్ద చేపలు ఉండొచ్చు కానీ గోల్డ్ ఫిష్ మాత్రం మేమే అని తెలిపాడు. దీంతో తన సినిమా పై ఎంత ధీమా ఉందో స్పష్టమైంది. టీజర్ చూశాక ఈ సినిమాపై అంచనాలు డబుల్ అయ్యాయి. మరి ఈ మూడు సినిమాల్లో ఏది ఎలా సక్సెస్ అవుతుందో చూడాలి.
