Naga Vamsi

Naga Vamsi: వార్-2 ఫ్లాప్‌పై నాగవంశీ స్పందన.. ట్రోలింగ్‌కు చెక్!

Naga Vamsi: టాలీవుడ్ స్టార్ నిర్మాత నాగవంశీ తాజాగా వార్-2 చిత్రంపై స్పందించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టడంతో సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరిగింది. పెద్ద నిర్మాత ఆదిత్య చోప్రాతో కలిసి నమ్మకంతో ముందడుగు వేశామని, కానీ ఫలితం నిరాశపరిచిందని ఆయన అన్నారు. ఇంకా ఆయన ఏమన్నారో పూర్తి వివరాలు చూద్దాం.

Also Read: Ilayaraja: డ్యూడ్ సినిమాకి బిగ్ షాక్.. హైకోర్టులో కాపీ రైట్ కేసు వేసిన ఇళయరాజా

టాలీవుడ్ టాప్ నిర్మాత నాగవంశీ రీసెంట్‌గా డిస్ట్రిబ్యూట్ చేసిన వార్-2 చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘోరంగా విఫలమైంది. భారీ అంచనాలతో రిలీజైన ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. దీంతో సోషల్ మీడియాలో నాగవంశీపై తీవ్ర ట్రోలింగ్ జరిగింది. ఈ నేపథ్యంలో ఆయన స్పందిస్తూ, యష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మాత ఆదిత్య చోప్రాపై నమ్మకంతో సినిమాను డిస్ట్రిబ్యూట్ చేశామని, కానీ ఫలితం మిస్‌ఫైర్ అయ్యిందని వెల్లడించారు. తనతో పాటు ఎన్టీఆర్ కూడా చాలా నమ్మకంగా ఉన్నారని, కానీ ఫలితం ఇలా ఉంటుందని అనుకోలేదని అన్నారు. ఆ నిర్మాత చేసిన తప్పుకు మేము నష్టపోయామని అన్నారు. తాము కేవలం డిస్ట్రిబ్యూషన్‌కు పరిమితమయ్యామని, సినిమాను తాము నిర్మిస్తే ఫలితం వేరేలా ఉండేదని ఆయన అభిప్రాయపడ్డారు. సోషల్ మీడియాలో వచ్చే ప్రశంసలు, విమర్శలను సమానంగా స్వీకరించాలని ఆయన సూచించారు. ఇదిలా ఉంటే, నాగవంశీ నిర్మిస్తున్న రవితేజ నటించిన ‘మాస్ జాతర’ చిత్రం అక్టోబర్ 31న గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. వార్-2 ఫలితం నిరాశపరిచినా, నాగవంశీ తన కొత్త ప్రాజెక్ట్‌తో బౌన్స్ బ్యాక్ అవుతారని అభిమానులు ఆశిస్తున్నారు.

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *