Telangana:

Telangana: రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు రేవంత్‌రెడ్డి, కేసీఆర్‌ నూత‌న సంవ‌త్స‌ర శుభాకాంక్ష‌లు

Telangana: ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి, మాజీ ముఖ్య‌మంత్రి కే చంద్ర‌శేఖ‌ర్‌రావు తెలంగాణ రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు నూత‌న సంవ‌త్స‌ర శుభాకాంక్ష‌లు తెలిపారు. 2025 విశ్వావ‌సు నామ సంవ‌త్స‌రం వెళ్లి 2026 శ్రీ ప‌రాభ‌వ నామ సంవ‌త్స‌రం రాక‌ను ఉద్దేశించి వారిద్దరూ వేర్వేరు ప్ర‌క‌ట‌న‌ల్లో సందేశాలు పంపారు. ఈ నూత‌న సంవ‌త్స‌రంలో తెలంగాణ ప్ర‌జ‌ల అభివృద్ధి, సంక్షేమంలో ముందుడాల‌ని వారిద్ద‌రూ కోరుకోవ‌డం విశేషం.

రాష్ట్రం మ‌రింత అభివృద్ధి సాధించాలి: సీఎం రేవంత్‌రెడ్డి
Telangana: 2026వ సంవ‌త్స‌రంలో తెలంగాణ రాష్ట్రం మ‌రింత‌గా అభివృద్ధి సాధించాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి ఆకాంక్షించారు. తెలంగాణ రైజింగ్ విజ‌న్-2047 లక్ష్య సాధ‌న దిశ‌గా రాష్ట్ర ప్ర‌భుత్వం ముందుకు సాగుతుంద‌ని తెలిపారు. ఈ కొత్త సంవ‌త్స‌రంలో త‌మ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యాలు తీసుకుంటుంద‌ని చెప్పారు. రాష్ట్రంలోని అన్నివ‌ర్గాల ప్ర‌జ‌ల ఆకాంక్ష‌ల‌ను నెర‌వేర్చ‌డానికి త‌మ ప్ర‌భుత్వం ఎల్ల‌వేళ‌లా కృషి చేస్తుంద‌ని తెలిపారు. ఆ దిశ‌గా తాము అడుగులు వేస్తామ‌ని హామీ ఇచ్చారు. ప్ర‌జా సంక్షేమంలో రాష్ట్ర అభివృద్ధి ప‌థంలో ప‌య‌నిస్తుంద‌ని చెప్పారు. ఈ ఏడాది అన్నింటా ఉన్న‌త ల‌క్ష్యాల‌ను చేరుకోవాల‌న్న‌దే త‌మ ల‌క్ష్య‌మ‌ని రేవంత్‌రెడ్డి ఉద్ఘాటించారు.

తెలంగాణ ప్ర‌జ‌ల ప్ర‌యోజ‌నాలే ముఖ్యం: మాజీ సీఎం కేసీఆర్‌
Telangana: తెలంగాణ రాష్ట్ర ప్ర‌జ‌ల ప్ర‌యోజ‌నాలే త‌మ‌కు ముఖ్యమ‌ని, వారి ప్ర‌యోజ‌నాల కోస‌మే ఈ ఏడాది అంతా త‌మ పార్టీ ప‌నిచేస్తుంద‌ని మాజీ ముఖ్య‌మంత్రి, బీఆర్ఎస్ పార్టీ అధినేత క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్‌రావు తెలిపారు. ఈ నూత‌న సంవ‌త్స‌రంలో రెట్టించిన ప‌ట్టుద‌ల‌తో త‌మ‌కు ప్ర‌జ‌లు అప్ప‌గించిన బాధ్య‌త‌ల‌ను పార్టీ నిర్వ‌హిస్తుంద‌ని చెప్పారు. ఈ నూత‌న సంవ‌త్స‌రంలో వ్య‌వ‌సాయం, సాగునీటి రంగాలు గ‌డిన‌ప‌డాల‌ని కోరుకున్నారు. తెలంగాణ రైతాంగం, మ‌హిళ‌లు, స‌క‌ల జ‌నులు సుఖ సంతోషాల‌తో జీవించాల‌ని కోరుకుంటున్న‌ట్టు తెలిపారు. తెలంగాణ అంత‌టా అభివృద్ధి ఫ‌లాలు అందాల‌ని కేసీఆర్ ఆకాంక్షించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *