Telangana CMO: 1,071 మందిని కాపాడినం

Telangana cmo: తెలంగాణలో నిన్నటి నుంచి కురుస్తున్న భారీ వర్షాలు, వరదల కారణంగా రాష్ట్ర ప్రభుత్వం విస్తృతమైన సహాయక చర్యలను చేపట్టింది. ఇప్పటి వరకు వరదల్లో చిక్కుకున్న 1,071 మందిని సురక్షితంగా బయటకు తరలించామని తెలంగాణ సీఎంవో ప్రకటించింది.

అదనంగా, వరద ప్రభావిత ప్రాంతాల్లో 1,000 మందికి ఆహార సరఫరా జరిగిందని వెల్లడించింది. ఈ ఆపరేషన్లలో స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (SDRF), నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (NDRF), స్థానిక పోలీసు బృందాలు పాల్గొన్నాయి.

కొన్నిచోట్ల వరదలో ఇరుక్కున్న వారికి డ్రోన్ల సహాయంతో ఆహార పదార్థాలు పంపిణీ చేసినట్టు అధికారిక ప్రకటనలో పేర్కొన్నారు. కామారెడ్డి, మెదక్, ఖమ్మం వంటి తీవ్ర ప్రభావిత జిల్లాల్లో ఈ రెస్క్యూ చర్యలు కొనసాగుతున్నాయని సీఎంవో తెలిపింది.

 

 

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Jai shah: కోహ్లీ రిటైర్మెంట్ పై జై షా వైరల్ కామెంట్స్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *