Hyderabad: తెలంగాణ ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క 2025-26 ఆర్థిక సంవత్సరానికి గానూ రూ.3,04,965 కోట్లతో రాష్ట్ర బడ్జెట్ను అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్లో వివిధ కీలక రంగాలకు కేటాయింపులు కింది విధంగా ఉన్నాయి.
కేంద్ర భాగస్వామ్యంతో ముఖ్య రంగాలకు నిధులు
ఆరు గ్యారేంటిలకు – రూ. 56, 084 కోట్లు
వ్యవసాయ శాఖ – రూ.24,439 కోట్లు
పశుసంవర్ధక శాఖ – రూ.1,674 కోట్లు
నీటిపారుదల – రూ.23,373 కోట్లు
అడవులు, పర్యావరణం – రూ.1,023 కోట్లు
రైతు భరోసా – రూ.18,000 కోట్లు
వైద్యారోగ్య శాఖ – రూ.12,393 కోట్లు
విద్యుత్ రంగం – రూ.21,221 కోట్లు
ఉపాధి కల్పన – రూ.900 కోట్లు
విద్య – రూ.23,108 కోట్లు
ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల అభివృద్ధి – రూ.11,600 కోట్లు
పారిశ్రామిక, భద్రత రంగాల్లో నిధుల కేటాయింపు
పారిశ్రామిక రంగం – రూ.3,525 కోట్లు
పౌర సరఫరాల శాఖ – రూ.5,734 కోట్లు
హోంశాఖ & శాంతిభద్రతలు – రూ.10,188 కోట్లు
వివిధ ఇతర శాఖలకు నిధుల కేటాయింపు
గ్రామీణాభివృద్ధి (ఆర్ అండ్ బీ) – రూ.5,907 కోట్లు
పర్యాటక రంగం – రూ.775 కోట్లు
పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి – రూ.31,605 కోట్లు
పురపాలక, పట్టణాభివృద్ధి – రూ.17,677 కోట్లు
హైదరాబాద్ నగరాభివృద్ధి – రూ.150 కోట్లు
చేనేత పరిశ్రమ – రూ.371 కోట్లు
సాంకేతిక రంగం (ఐటీ) – రూ.774 కోట్లు
సాంస్కృతిక రంగం – రూ.465 కోట్లు
దేవాదాయ, ధర్మాదాయ శాఖ – రూ.190 కోట్లు
క్రీడల అభివృద్ధి – రూ.465 కోట్లు
సంక్షేమ రంగంలో నిధుల కేటాయింపు
స్త్రీ, శిశు సంక్షేమం – రూ.2,861 కోట్లు
మహిళా, శిశు సంక్షేమానికి – రూ.2,862 కోట్లు
ఎస్సీ సంక్షేమం – రూ.40,232 కోట్లు
ఎస్టీ సంక్షేమం – రూ.17,169 కోట్లు
బీసీ సంక్షేమం – రూ.11,405 కోట్లు
మైనార్టీ సంక్షేమం – రూ.3,591 కోట్ల
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం – రూ.22,500 కోట్లు
గృహజ్యోతి & ఉచిత విద్యుత్ – రూ.3,000 కోట్లు
ఈ బడ్జెట్లో తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి అవసరమైన ప్రధాన రంగాలకు నిధులు కేటాయించడం గమనార్హం.