Telangana Assembly

Telangana Assembly: మూడు బిల్లులకు ఆమోదం తెలిపిన తెలంగాణ అసెంబ్లీ

Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఆదివారం ఉత్కంఠభరితంగా కొనసాగాయి. సభలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే మున్సిపల్, పంచాయతీరాజ్ చట్టసవరణ బిల్లులు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. అధికార, ప్రతిపక్షాల మధ్య వాదోపవాదాలు చోటుచేసుకున్నప్పటికీ, బిల్లులను సభ ఏకగ్రీవంగా ఆమోదించింది.

మున్సిపల్ చట్ట సవరణ బిల్లును ప్రవేశపెట్టిన మంత్రివర్యులు శ్రీధర్ బాబు మాట్లాడుతూ, “స్థానిక ఎన్నికల్లో బీసీలకు న్యాయం చేయాలన్న ఉద్దేశంతోనే ఈ బిల్లును తెచ్చాం. చర్చ జరుగుతుండగా ఆర్డినెన్స్ అవసరం లేదు” అని స్పష్టం చేశారు. అనంతరం బిల్లుకు ఆమోదం లభించడంతో, బీసీ రిజర్వేషన్ల అమలు దిశగా దారితీసే మార్గం సుగమమైంది.

పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లును సభలో ప్రవేశపెట్టిన మంత్రి సీతక్క మాట్లాడుతూ, “బీసీ సంక్షేమం పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఈ బిల్లుతో బలహీన వర్గాలకు చట్టపరమైన రక్షణ కల్పించాలన్నదే లక్ష్యం” అని వివరించారు.

బీఆర్ఎస్ మద్దతు – కాంగ్రెస్‌పై విమర్శలు

ఈ సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ, బిల్లుకు తమ పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తోందని స్పష్టం చేశారు. అయితే, బీసీ సబ్ ప్లాన్ అమలు అవసరాన్ని సూచిస్తూ, “బలహీన వర్గాల సంక్షేమం కాంగ్రెస్ మాటలకే పరిమితమైంది. బీసీలకు న్యాయం జరగాలంటే రాజ్యాంగ సవరణ అవసరం” అని అభిప్రాయపడ్డారు.

ఇది కూడా చదవండి: KTR: చట్టాల్లో లొసుగులు లేకుండా చేస్తే ఏ న్యాయవ్యవస్థ అడ్డురాదు

అలాగే, మాజీ సీఎం కేసీఆర్ నాయకత్వంలో బీసీలకు కీలక పదవులు ఇవ్వడం, రాజ్యసభకు ఐదుగురు బీసీలను పంపడం వంటి ఉదాహరణలను ప్రస్తావిస్తూ, తమ పార్టీ ఎల్లప్పుడూ బీసీ హక్కుల పక్షానే నిలబడిందని గుర్తుచేశారు.

అసెంబ్లీలో మూడు బిల్లులకు గ్రీన్ సిగ్నల్

ఈ సమావేశంలో మున్సిపల్, పంచాయతీరాజ్ చట్టసవరణలతో పాటు ప్రైవేట్ అలోపతిక్ మెడికల్ కేర్ ఎస్టాబ్లిష్‌మెంట్ బిల్లుకు కూడా ఆమోదం లభించింది. బిల్లులన్నీ ఏకగ్రీవంగా ఆమోదించడంతో ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాల అమలుకు బలమైన పునాది వేసింది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Murder: హైదరాబాద్‌లో అడ్వొకేట్ దారుణ హత్య..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *