Amaravati: ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించిన టీడీపీ .

Amaravati: ఆంధ్రప్రదేశ్‌లో ఎమ్మెల్యే కోటా ద్వారా భర్తీ చేయనున్న ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు మార్చి 20న ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో పొత్తులో భాగంగా, టీడీపీ జనసేనకు ఒక ఎమ్మెల్సీ స్థానం, బీజేపీకి మరో ఎమ్మెల్సీ స్థానం కేటాయించింది. మిగిలిన మూడు స్థానాలకు తమ అభ్యర్థులను టీడీపీ తాజాగా ప్రకటించింది.

టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు:

1. బీదా రవిచంద్ర – నెల్లూరు జిల్లాకు చెందిన వీరు పార్టీకి మొదటి నుంచి విశ్వాసంగా సేవలందిస్తున్నారు.

2. కావలి గ్రీష్మ – శ్రీకాకుళంకు చెందిన గ్రీష్మ, మాజీ అసెంబ్లీ స్పీకర్ ప్రతిభా భారతి కుమార్తె.

3. బీటీ నాయుడు – కర్నూలు జిల్లా బీసీ సామాజిక వర్గానికి చెందిన నేత.

ఈ ముగ్గురిలో ఒకరు ఎస్సీ సామాజిక వర్గానికి చెందినవారు కాగా, మరో ఇద్దరు బీసీ వర్గానికి చెందినవారు.ఇక, జనసేన తరఫున నాగబాబు ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఇప్పటికే నామినేషన్ వేశారు.

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *