Dowry Harassment

Dowry Harassment: 100 సావర్ల బంగారం, 70 లక్షల కారు కొనిచ్చిన మళ్లీ వరకట్న వేధింపులు.. మహిళ మృతి

Dowry Harassment: తమిళనాడులోని తిరుప్పూర్‌ పట్టణం ఓ విషాదకథకు వేదిక అయింది. 27 ఏళ్ల యువతి రాధన్య, పెళ్లి అయిన రెండు నెలలకే తన జీవితం ముగించుకుంది. కారణం? భర్త, అత్త, మామల నుంచి వచ్చిన వరకట్న వేధింపులు.

ఘనంగా జరిగిన పెళ్లి.. కానీ మూడు నెలల ముచ్చటే!

వస్త్ర వ్యాపారి అన్నాదురై కుమార్తె అయిన రాధన్య, ఈ ఏప్రిల్‌లో కవిన్ కుమార్ అనే వ్యక్తితో పెళ్లి జరిగింది. చదువుకున్న వాడు, మంచి ఉద్యోగం.. అన్నీ బాగానే ఉన్నాయి. పెళ్లిలో 800 గ్రాముల బంగారం, రూ. 70 లక్షల విలువైన వోల్వో కార్ లాంటి భారీ వరాలు ఇచ్చారు. మొత్తంగా రూ.2.5 కోట్లు ఖర్చు చేశారు.

అయితే, పెళ్లి తర్వాత అసలు మైన కష్టం మొదలైంది. ఇంకా 200 గ్రాముల బంగారం ఇవ్వలేదని పదే పదే మానసిక వేధింపులు మొదలయ్యాయి. రోజూ అలజడులు, దుర్బాషలు, కిందచూపే మాటలు.. ఇవే ఆమె జీవితంలో నిత్యమైన బాధగా మారాయి.

చివరిసారి తండ్రికి పంపిన వాయిస్ మెసేజ్‌లు

ఆత్మహత్యకు ముందు రాధన్య తన తండ్రికి ఏడుమాట్ల వాయిస్ మెసేజ్‌లు పంపింది. “నాకు ఈ జీవితం ఇష్టం లేదు నాన్న.. భరించలేకపోతున్నా.. నువ్వూ, అమ్మే నా ప్రపంచం.. నన్ను క్షమించండి” అంటూ కన్నీటి మాటలు చెప్పింది.

ఆమె భర్త కవిన్ తనపై దాడి చేశాడని, అత్త మామలు తిట్లు, ఒత్తిళ్లతో తన మనసును విరిచేశారని ఆ మెసేజ్‌ల్లో చెప్పింది. ఎవరికైనా చెప్పినా, “ఇది కామన్.. భరించాలి” అంటూ అలక్ష్యం చేశారు. ఎవ్వరు తన బాధను గమనించలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.

ఇది కూడా చదవండి: Drinking Hot Water: ఉదయం గ్లాస్ వేడి నీళ్ళు తాగితే ఏమవుతుందో తెలుసా..?

పోలీసులు కేసు నమోదు, అరెస్టులు

ఈ విషాద ఘటనపై చెయూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. రాధన్య భర్త కవిన్ కుమార్, అతని తల్లి చిత్రాదేవి, తండ్రి ఈశ్వరమూర్తిని అరెస్ట్ చేశారు. వరకట్న వేధింపులు, ఆత్మహత్యకు ప్రేరేపించడం వంటి కేసులపై దర్యాప్తు కొనసాగుతోంది.

ఒక కట్నం.. ఒక జీవితాన్ని బలి తీసుకుంది!

రాధన్య ఘటన మనకు ఒక కఠినమైన నిజాన్ని గుర్తు చేస్తోంది — కట్నం అనే పాడు పరంపర ఇంకా మన మధ్యనే ఉంది. 60 ఏళ్లు నిండిన కట్న నిషేధ చట్టం ఉన్నా, ఇప్పటికీ చదువుకున్నవాళ్లు, సంపన్న కుటుంబాలు ఈ ఆచారం పేరుతో జీవాలను నాశనం చేస్తున్న తీరు ఆందోళన కలిగిస్తోంది.

ALSO READ  Warangal:వ‌రంగ‌ల్‌లో పోలీస్‌స్టేష‌న్‌లో చిరువ్యాపారి ఆత్మ‌హ‌త్యాయ‌త్నం

ఓ సందేశం — “ఇంకా ఎంతమందిని పోగొట్టుకుంటే మారతారు?”

ఈ సంఘటనతో కనీసం మరొకరు కనురెప్పల మీద వ్రేలాడే ప్రాణాన్ని కోల్పోకుండా ఉండాలి. కట్నం ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకోవద్దని, పెళ్లి అనేది రెండు మనసుల మధ్య నమ్మకంతో ఉండాలని ఈ కథనం ద్వారా ప్రతి ఒక్కరికీ ఓ సందేశం చేరాలి.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *