Stock market: కుప్పకూలిన స్టాక్ మార్కెట్

Stock market: విమాన ప్రమాదం వార్తల ప్రభావం స్టాక్ మార్కెట్లపై స్పష్టంగా కనిపించింది. ముఖ్యంగా విమానయాన రంగానికి చెందిన షేర్లు తీవ్రంగా పతనమయ్యాయి. భారత్ ఎయిర్‌లైన్స్‌ షేర్లు భారీగా పడిపోయాయి. అమెరికాలో బోయింగ్‌ కంపెనీ షేర్లు ఏకంగా 8 శాతం వరకు కుప్పకూలాయి.

దీని ప్రభావంతో దేశీయ స్టాక్ మార్కెట్లు కూడా బలహీనంగా ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్‌ 823 పాయింట్ల నష్టంతో ముగియగా, నిఫ్టీ 253 పాయింట్ల నష్టంతో క్లోజ్ అయ్యింది. వరుసగా రెండో రోజు మార్కెట్లు నష్టాల్లో ముగియడం పెట్టుబడిదారులకు నిరాశను కలిగించింది.

నిపుణులు ఈ పరిస్థితిని తాత్కాలిక ప్రభావంగానే పేర్కొంటున్నారు. కానీ విమానయాన రంగానికి ఇది సంకేతాత్మక హెచ్చరిక అని చెబుతున్నారు.

 

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  PM Narendra Modi: జూన్‌ 21న విశాఖ‌కు ప్ర‌ధాని మోదీ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *