SSMB 29: ప్రస్తుతం SSMB 29 సినిమా షూటింగ్ హైదరాబాద్ లో వేసిన ప్రత్యేక సెట్స్ లో జరుగుతుంది. సినిమా సెట్స్ పైకి వెళ్లాక ఇదే మొదటి షెడ్యూల్. అయితే ఫస్ట్ షెడ్యూల్ పూర్తయ్యాక రాజమౌళి ప్రెస్ మీట్ ను నిర్వహించాలనే ఆలోచనలో ఉన్నాడని సమాచారం.మామూలుగా తాను చేస్తున్న సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లే ముందు సినిమాలోని నటీనటులు, తన టీమ్ తో భారీ ప్రెస్ మీట్ నిర్వహించి అందులో నటించేబోయే క్యాస్టింగ్, టెక్నికల్ టీమ్ తో పాటూ సినిమా ఏ జానర్ లో, ఎలాంటి బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కనుందనే విషయాల్ని రివీల్ చేసేవాడు.
Also Read: Holi 2025: హోలీని ఇక్కడ జరుపుకుంటే.. మాత్రం ఎప్పటికీ మర్చిపోలేరు
కానీ ఇప్పుడు మహేష్ బాబుతో చేస్తున్న సినిమా విషయంలో మాత్రం రాజమౌళి మొదటి నుంచి సైలైంట్ గానే ఉంటూ వస్తున్నాడు.తాజా సమాచారం ప్రకారం, ప్రస్తుతం జరుగుతున్న షెడ్యూల్ షూటింగ్ పూర్తైన తర్వాత రాజమౌళి ప్రెస్ మీట్ నిర్వహించి ఎస్ఎస్ఎంబీ29 గురించి అనేక ఆసక్తికర విషయాలను వెల్లడించనున్నట్టు తెలుస్తోంది. ఈ ప్రెస్ మీట్ తోనే ప్రమోషన్స్ ను కూడా స్టార్ట్ చేయనున్నాడు.త్వరలోనే ఈ ప్రెస్ మీట్ కు సంబంధించిన అధికారిక ప్రకటన రానుందని సమాచారం.