Spirit: పాన్ ఇండియా ఐకాన్ ప్రభాస్, బాలీవుడ్ హిట్ మేకర్ సందీప్ రెడ్డి వంగా కాంబోలో రాబోతున్న ‘స్పిరిట్’ సినిమా హైప్ రోజురోజుకూ పెరుగుతోంది. ఈ చిత్రం ప్రకటన తర్వాత నుంచి అభిమానుల్లో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. యాక్షన్ థ్రిల్లర్గా రూపొందనున్న ఈ మూవీపై ప్రతి అప్డేట్కూ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా, ఈ సినిమాను ఒకటి కాకుండా రెండు భాగాలుగా తీర్చిదిద్దే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు ఫిల్మ్ సర్కిల్స్లో జోరుగా చర్చ నడుస్తోంది. స్క్రిప్ట్ డిమాండ్తో ఈ నిర్ణయం తీసుకున్నారని టాక్.
సందీప్ రెడ్డి గత చిత్రం ‘యానిమల్’ కూడా రెండు భాగాలుగా ప్లాన్ చేయగా, మొదటి పార్ట్ బాక్సాఫీస్ను షేక్ చేసింది. ఇప్పుడు అదే ఫార్ములాను ‘స్పిరిట్’ కోసం అనుసరించే అవకాశం ఉందని అంటున్నారు. ఈ వార్త నిజమైతే, ప్రభాస్ ఫ్యాన్స్కు పండగే! మరి, ఈ రెండు భాగాల కథాంశం ఎలా ఉంటుందో చూడాలి.