Union Budget 2026-2027: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ను ప్రవేశపెట్టారు. దేశాభివృద్ధిలో యువత పాత్రను గుర్తిస్తూ దీనికి ‘యువ శక్తి బడ్జెట్’ అని నామకరణం చేశారు. రాబోయే కాలంలో భారత ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టించేందుకు ఆరు కీలక సూత్రాలను ప్రాతిపదికగా తీసుకున్నట్లు ఆమె ప్రకటించారు.
ఆర్థిక వృద్ధికి ‘ఆరు’ సూత్రాలు: దేశాన్ని ప్రపంచ ఆర్థిక శక్తిగా మార్చేందుకు మంత్రి నిర్మలా సీతారామన్ ఈ క్రింది ఆరు రంగాలపై ప్రత్యేక దృష్టి సారించారు:
-
తయారీ రంగం విస్తరణ (Scaling up Manufacturing): ఏడు వ్యూహాత్మక రంగాలలో ఉత్పత్తి సామర్థ్యాన్ని భారీగా పెంచడం.
-
పాత పారిశ్రామిక రంగాలకు పునరుజ్జీవం (Rejuvenating Legacy Sectors): సంప్రదాయ పారిశ్రామిక క్లస్టర్లను ఆధునీకరించడం.
-
ఛాంపియన్ ఎంఎస్ఎంఈలు (Champion MSMEs): చిన్న, మధ్య తరహా పరిశ్రమలను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడం.
-
మౌలిక సదుపాయాల కల్పన (Infra Push): రోడ్లు, రైల్వేలు మరియు డిజిటల్ మౌలిక సదుపాయాల కోసం భారీగా నిధులు కేటాయించడం.
-
ఆర్థిక భద్రత మరియు స్థిరత్వం: దీర్ఘకాలికంగా దేశ ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేయడం.
-
సిటీ ఎకనామిక్ రీజియన్స్: నగరాలను కేవలం నివాస ప్రాంతాలుగా కాకుండా ఆర్థిక కేంద్రాలుగా (Economic Hubs) తీర్చిదిద్దడం.
ఇది కూడా చదవండి: Ambati Rambabu: మాజీ మంత్రి అంబటి రాంబాబు అరెస్ట్.. గుంటూరులో ఉద్రిక్తత
బడ్జెట్ ముఖ్యాంశాలు:
-
ఎంఎస్ఎంఈలకు ఊతం: వీటి కోసం రూ. 10,000 కోట్లతో ‘SME గ్రోత్ ఫండ్’ను ఏర్పాటు చేశారు. అలాగే ‘సెల్ఫ్ రిలయంట్ ఇండియా ఫండ్’కు అదనంగా రూ. 4,000 కోట్లు కేటాయించారు.
-
తయారీ రంగానికి బూస్ట్: బయో-ఫార్మా శక్తి (Bio-pharma Shakti) పేరుతో రూ. 10,000 కోట్లతో కొత్త పథకాన్ని ప్రకటించారు. సెమీకండక్టర్ మిషన్ (ISM 2.0) కోసం రూ. 40,000 కోట్లు కేటాయించారు.
-
నగరాల అభివృద్ధి: రాబోయే తరం నగరాల కోసం రూ. 1 లక్ష కోట్లతో ‘అర్బన్ ఛాలెంజ్ ఫండ్’ను ప్రవేశపెట్టారు.
-
ఉపాధి కల్పన: టెక్స్టైల్ మరియు ఇతర కీలక రంగాల్లో కొత్త పథకాల ద్వారా లక్షలాది ఉద్యోగాలను సృష్టించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఈ బడ్జెట్ ద్వారా ఉపాధి కల్పన పెరగడమే కాకుండా, స్వదేశీ ఉత్పత్తుల ఎగుమతులు కూడా భారీగా పెరుగుతాయని ప్రభుత్వం ధీమా వ్యక్తం చేస్తోంది.
