Phone Tapping Case: తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తును పోలీసులు మరింత ముమ్మరం చేశారు. ఈ వ్యవహారంలో తాజాగా మరికొందరికి నోటీసులు అందడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. తాజాగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ నవీన్రావు తండ్రి కొండలరావు, అలాగే కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కుమారుడు సందీప్రావులకు ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) నోటీసులు జారీ చేసింది.
గతంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ ప్రక్రియలో వీరిద్దరి ఫోన్లు కూడా ట్యాపింగ్కు గురైనట్లు దర్యాప్తు అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. దీనికి సంబంధించి మరిన్ని కీలక వివరాలు సేకరించేందుకు, నేడు విచారణకు హాజరుకావాలని సిట్ అధికారులు తమ నోటీసుల్లో పేర్కొన్నారు. జూబ్లీహిల్స్లోని తమ కార్యాలయానికి వచ్చి స్టేట్మెంట్ ఇవ్వాలని వారిని కోరారు.
అసలు వీరి ఫోన్లను ఎందుకు ట్యాప్ చేశారు? దీని వెనుక ఉన్న వ్యక్తులు ఎవరు? అన్న కోణంలో పోలీసులు విచారణ జరపనున్నారు. ఇప్పటికే ఈ కేసులో పలువురు పోలీసు ఉన్నతాధికారులు అరెస్టయి జైలులో ఉండగా, ఇప్పుడు రాజకీయ నాయకుల కుటుంబ సభ్యులను విచారణకు పిలవడం ఈ కేసును మరో మలుపు తిప్పేలా కనిపిస్తోంది. బాధితులుగా వీరి నుంచి సేకరించే సమాచారం ఈ కేసు దర్యాప్తులో అత్యంత కీలకం కానుంది.
