Simhachalam Temple

Simhachalam Temple: రేపే సింహాచలం అప్పన్న గిరి ప్రదక్షిణ.. భయపడుతున్న భక్తులు

Simhachalam Temple: విశాఖపట్నంలో ప్రసిద్ధమైన సింహగిరి గిరి ప్రదక్షిణ వేడుకలు ఈ నెల 9న ప్రారంభం కానున్నాయి. 32 కిలోమీటర్ల మేర జరిగే ఈ గిరి ప్రదక్షిణలో లక్షలాది మంది భక్తులు పాల్గొననున్నారు. అధికారుల అంచనా ప్రకారం ఈసారి 15 లక్షల మంది వరకు గిరి ప్రదక్షిణలో పాల్గొనే అవకాశం ఉంది.

ఎర్పాట్లు విస్తృతంగా

కలెక్టర్ హరేందర్ ప్రసాద్, దేవస్థానం ఈవో త్రినాథ రావు నేతృత్వంలో అన్ని శాఖల సమన్వయంతో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.
✔️ 29 ప్రదేశాల్లో భక్తుల విశ్రాంతి కోసం షెడ్లు
✔️ 31 ప్రాంతాల్లో వైద్య శిబిరాలు
✔️ 12 చోట్ల 17 అంబులెన్స్‌లు
✔️ 5 ప్రదేశాల్లో పబ్లిక్ అడ్రసింగ్ సిస్టమ్‌లు ఏర్పాటు చేశారు.

ఈసారి ప్రతి విశ్రాంతి కేంద్రంలోనే మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయడం విశేషం.

గిరి ప్రదక్షిణ మార్గం:

తొలిపావంచా → అడవివరం → పైనాపిల్ కాలనీ → సెంట్రల్ జైల్ → హనుమంతవాక → విశాలాక్షినగర్ → జోడుగుళ్లపాలెం → తెన్నేటి పార్క్ → అప్పుఘర్ → ఎంవీపీ కాలనీ → సీతమ్మధార → నరసింహనగర్ → పోర్టు డీఎల్‌బీ క్వార్టర్స్ → కప్పరాడ → మురళీనగర్ → మాధవధార → ఆర్ అండ్ బీ కార్యాలయం → లక్ష్మీనగర్ → కుమారి కల్యాణ మండపం → ప్రహ్లాదపురం → సింహాచలం.

ప్రధాన సమయాలు:

  • 9వ తేదీ: మధ్యాహ్నం 2 గంటలకు తొలిపావంచా వద్ద పుష్పరథం ప్రారంభం. అదే రోజు రాత్రి 10 గంటల వరకు భక్తులకు దర్శనం.

  • 10వ తేదీ: ఉదయం 5.30 నుంచి మధ్యాహ్నం 2.30 వరకు నిరంతర దర్శనం, సాయంత్రం 5 నుంచి 7 వరకు మళ్లీ దర్శనం.

  • 10వ తేదీ: తెల్లవారుజామున 3 గంటల నుంచే ఆలయ ప్రదక్షిణలకు అనుమతి.

ఉచిత ప్రయాణం:

ఆర్టీసీ బస్సులు, దేవస్థానం బస్సులు ఉచితంగా అందుబాటులో ఉంటాయి. కొండపైకి, దిగువకు భక్తులను ఉచితంగా తీసుకెళ్లేందుకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు.

భద్రతా చర్యలు:

  • 400 తాత్కాలిక మరుగుదొడ్ల ఏర్పాటు

  • అన్ని స్టాళ్లలో మంచినీటి సదుపాయం

  • అప్పుఘర్, మాధవధారలో ప్రత్యేక శిబిరాలు, పబ్లిక్ అడ్రసింగ్ సిస్టమ్‌లు, గజఈతగాళ్లు నియామకం

  • పెద్ద ఎత్తున పోలీస్ బందోబస్తు

  • 9వ తేదీ ఉదయం 6 గంటల నుంచి 10వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు మద్యం దుకాణాలు మూసివేత

  • అగ్నిమాపక శకటాలు సిద్ధంగా ఉంచడం

  • స్వామివారి నమూనా ఆలయాన్ని రెండో ఘాట్ రోడ్ వద్ద ఏర్పాటు.

ప్రమాదం కలకలం:

తొలిపావంచా వద్ద భక్తుల కోసం నిర్మించిన తాత్కాలిక రేకుల షెడ్డు కూలిపోవడంతో కలకలం చెలరేగింది. అదృష్టవశాత్తు ఎటువంటి ప్రాణహానీ జరగలేదు. నిర్మాణంలో లోపాల కారణంగానే ఇది జరిగిందని అధికారులు అంగీకరించారు. కలెక్టర్, పోలీస్ కమిషనర్ సీరియస్‌గా స్పందించి తాత్కాలిక నిర్మాణాల పరిశీలనకు ఆదేశించారు.

ALSO READ  Mahaa Vamsi: జగన్ బిగ్ ప్లాన్..సాయిరెడ్డి రీఎంట్రీ..:

ఇది కూడా చదవండి: Gold Rate Today: పసిడి ప్రియులకు అలర్ట్.. భారీగా తగ్గిన బంగారం ధరలు.. తులం ఏంటంటే..?

భక్తుల ఆందోళన:

ఇటీవల చందనోత్సవం సమయంలో జరిగిన ప్రమాదాన్ని మర్చక ముందే ఇలా జరుగడంతో భక్తులు ఆందోళన చెందుతున్నారు. అధికారులు భద్రతా ప్రమాణాలను పాటించాలని, నిర్లక్ష్యం లేకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

కలెక్టర్ మాటలు:

ఈవెంట్‌ సందర్భంగా అన్ని శాఖల అనుమతులతో, ఎలాంటి ప్రమాదాలు జరగకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నామని కలెక్టర్ హరేందర్ ప్రసాద్ తెలిపారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *