Satya Prasad: లిక్కర్ స్కామ్ లో ఒక్కొక్కరిగా అరెస్టు

Satya Prasad: మద్యం కుంభకోణంపై మంత్రి అనగాని ఘాటు వ్యాఖ్యలు. కల్తీ మద్యం విక్రయాలతో ప్రజల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టిన వారిని అరెస్ట్ చేస్తే, దానిని కక్షసాధింపుగా అభివర్ణించడం సమంజసం కాదన్నారు మంత్రి సత్యప్రసాద్.

డిజిటల్ చెల్లింపులు లేకుండా వేల కోట్ల రూపాయల అక్రమ లావాదేవీలు జరిపిన వారిపై సిట్ అధికారులు తీవ్రంగా విచారణ జరుపుతున్నారని, ఒక్కొక్కరినీ అరెస్టు చేస్తూ ముందుకు వెళ్తున్నారని ఆయన తెలిపారు. విచారణ అధికారులకు సమాధానం చెప్పాల్సిన పరిస్థితిలో, రాజకీయ కక్షలు అన్నదే తప్పుదారి పట్టించే ప్రయత్నమని ఆయన విమర్శించారు.

ఈ సందర్భంగా వైసీపీ అధినేత జగన్‌మోహన్ రెడ్డిపై కూడా ఆయన మండిపడ్డారు. అధికారంలో ఉన్నప్పుడు హత్యలు, దాడులు, అక్రమ కేసులతో పాలన సాగించినవారు, ఇప్పుడు మొసలికన్నీళ్లు కార్చడం వెధవాస్మరించదగ్గదన్నారు.

ఇదిలా ఉండగా, మద్యం కుంభకోణంలో నిందితుల ఆస్తుల జప్తుకు విజయవాడ కోర్టు ఇటీవల అనుమతి ఇచ్చిన విషయాన్ని మంత్రి గుర్తుచేశారు. మొత్తం రూ.32 కోట్ల విలువైన ఆస్తుల సీజ్‌కు సంబంధించి ఆగస్టు 1లోపు నోటీసులు జారీ చేయాలని కోర్టు ఆదేశించిందని తెలిపారు.

కేసు విచారణ వేగంగా సాగుతుండగా, నిందితులెవరినీ వదిలే ప్రసక్తే లేదని, చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి అనగాని స్పష్టం చేశారు.

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *