Sanskrit in Madarsas: ఉత్తరాఖండ్లోని మదర్సాలలో త్వరలో సంస్కృతాన్ని బోధించే అవకాశం ఉంది. రాష్ట్రంలోని 400 కంటే ఎక్కువ మదర్సాలలో సంస్కృతాన్ని అప్షనల్ సబీజెక్ట్ గా ఉంచనున్నారు. మదర్సా బోర్డు చైర్మన్ ముఫ్తీ షామూన్ ఈ విషయాన్ని వెల్లడించారు. మదర్సాలలో సంస్కృతాన్ని నేర్పించాలనే అంశంపై చాలా కాలంగా పనిచేస్తున్నామని ఆయన చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ అనుమతి రాగానే ఈ నిర్ణయం అమలులోకి రానుంది. మదర్సాకు వెళ్లే పిల్లలను ప్రధాన స్రవంతితో అనుసంధానం చేయాలని ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి కోరుకుంటున్నారని, దీన్ని దృష్టిలో ఉంచుకుని ఈ పథకాన్ని రూపొందించామని షామూన్ చెప్పారు.
Sanskrit in Madarsas: మదర్సాలలో ఎన్సిఇఆర్టి సిలబస్ను అమలు చేయడం వల్ల మంచి ఫలితాలు వచ్చాయని బోర్డు ప్రెసిడెంట్ ముఫ్తీ షామూన్ అన్నారు. 96% పైగా పిల్లలు ఉత్తీర్ణులయ్యారు. దీన్నిబట్టి మదర్సాల్లో చదివే విద్యార్థుల్లో ప్రతిభకు కొదవ లేదని తేలింది. అవకాశం ఇస్తే కల్చర్తోపాటు అన్ని సబ్జెక్టుల్లోనూ రాణించగలరని షామూన్ అంటున్నారు. అరబిక్, సంస్కృతం రెండూ ప్రాచీన భాషలని.. మదర్సా విద్యార్థులకు అరబిక్తోపాటు సంస్కృతం చదివే అవకాశం వస్తే వారికి మేలు జరుగుతుందని భావిస్తున్నారు.
Sanskrit in Madarsas: విద్యార్థులను మతపరమైన విద్యకే పరిమితం చేయడం సరికాదని మదర్సాలలో సంస్కృతం బోధించడం మంచిదని ఉత్తరాఖండ్ వక్ఫ్ బోర్డు ఛైర్మన్ షాదాబ్ షమ్స్ అన్నారు. విద్యార్థులకు మతపరమైన విద్య ముఖ్యం, అయితే పిల్లలను కేవలం మతపరమైన విద్యకే పరిమితం చేయడం వారి భవిష్యత్తుతో ఆటలాడుతోంది. మదర్సాలు ప్రతిరోజు మతపరమైన విద్య కోసం ఒక గంట ఉంచుకోవచ్చు. వారికి రోజంతా మతపరమైన గ్రంథాలు మాత్రమే బోధించడం, వేరే ఏమీ నేర్చుకోనివ్వకపోవడం వారిని కుంగదీస్తుంది అని షాదాబ్ షమ్స్ చెప్పారు.
Sanskrit in Madarsas: సెప్టెంబరు 2022లో వక్ఫ్ బోర్డు ఛైర్మన్ అయిన తర్వాత, షాదాబ్ షామ్స్ ఆధునిక మదర్సా ఆలోచనతో ముందుకు వచ్చారు. విద్యార్థులకు కేవలం ధార్మిక విద్యనే కాకుండా కంప్యూటర్, సైన్స్ విద్యను కూడా అందించాలన్నారు. గతంలో అక్టోబర్ 13న జాతీయ బాలల సంరక్షణ కమిషన్ (ఎన్సీపీసీఆర్) మదర్సాలకు ఇస్తున్న నిధులను నిలిపివేయాలని అన్ని రాష్ట్రాలకు లేఖ రాసింది. ఇవి విద్యాహక్కు (RTE) నిబంధనలను పాటించడం లేదు అని పేర్కొంది.
‘విశ్వాస సంరక్షకులు లేదా హక్కుల వ్యతిరేకులు: పిల్లల రాజ్యాంగ హక్కులు వర్సెస్ మదర్సా’ అనే నివేదికను రూపొందించిన తర్వాత కమిషన్ ఈ సూచనను ఇచ్చింది. మదర్సాలలో, మొత్తం దృష్టి మతపరమైన విద్యపై ఉంది, దీని కారణంగా పిల్లలకు అవసరమైన విద్య లభించదు. వారు ఇతర పిల్లల కంటే వెనుకబడి ఉన్నారని NCPCR చెప్పింది-