Saiyaraa: బాక్సాఫీస్ను షేక్ చేసిన సైయారా ఇప్పుడు ఓటీటీలో సందడి చేయడానికి సిద్ధం అయ్యింది. యూత్ను ఊపేసిన ఈ రొమాంటిక్ డ్రామా అహాన్ పాండే, అనీత్ పడ్డా జోడీతో మాయ చేసింది. మోహిత్ సూరి డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా థియేటర్లలో రూ. 500 కోట్లు కొల్లగొట్టి సంచలనం సృష్టించింది. ఇప్పుడు ఈ లవ్స్టోరీ ఓటీటీలో ఎప్పుడు, ఎక్కడ స్ట్రీమ్ కానుంది? అభిమానులు ఎందుకు ఇంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు?
Also Read: Suriya: సూర్య సినిమాలో బాలీవుడ్ క్రేజీ స్టార్?
సైయారా ఓటీటీ రిలీజ్తో మరోసారి సంచలనం సృష్టించనుంది. జులై 18న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం నెట్ఫ్లిక్స్లో సెప్టెంబర్ 12 నుంచి స్ట్రీమింగ్ కానుందని వైఆర్ఎఫ్ కాస్టింగ్ డైరెక్టర్ షానూ శర్మ తెలిపారు. అహాన్ పాండే, అనీత్ పడ్డా జంటగా నటించిన ఈ రొమాంటిక్ డ్రామా ప్రపంచవ్యాప్తంగా రూ. 517 కోట్లు వసూలు చేసింది. మ్యూజికల్ లవ్స్టోరీగా రూపొందిన ఈ సినిమా యూత్లో క్రేజ్ సృష్టించింది. దీని ఓటీటీ రిలీజ్ కోసం అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.