Huzur Nagar: గతంలో హుజూర్నగర్ లో ధరణి ఆపరేటర్ గా పని చేస్తున్న జగదీష్ ప్రభుత్వ భూమిపై పలువురు కుటుంబ సభ్యుల పేర్లను ఎక్కించి… రైతుబంధు డబ్బులను దుర్వినియోగం చేశారని వార్తలు రావడంతో.. విచారణకి ఆదేశించిన కలెక్టర్.. విచారంలో నిజమని తేలడంతో, గతంలో విధులు నిర్వహించిన తాసిల్దార్, ప్రస్తుతం నల్లగొండ జిల్లా అనుముల తాసిల్దార్ గా పనిచేస్తున్న జయశ్రీ ను అదుపులో తీసుకున్న పోలీసులు కోర్టు ముందు హాజరపరచడం జరిగింది.
హుజూర్నగర్, బూరుగడ్డ రెవిన్యూ పరిధిలో 36.23 ఎకరాలకు ధరణి ద్వారా పాసుపుస్తకాలు పొంది రైతుబంధు నిధులు స్వాహా చేసిన ధరణి ఆపరేటర్ జగదీష్.. సుమారుగా రూ.14,63,004 లక్షల రైతుబంధు నిధులు మింగిన, ధరణి ఆపరేటర్. ధరణి ఆపరేటర్ జగదీష్ బంధువుల పేరిట 2019 పట్టాదారు పాసుబుక్కులు జారీ చేసిన తహసిల్దార్ జయశ్రీ.. పట్టాదారులు పేరుతో రైతుబంధు నిధులు స్వాహా చేయడంతో విచారణ చేసిన జిల్లా అధికార యంత్రాంగం.. ధరణి ఆపరేటర్ కి సహకరించారని పలు సెక్షన్ల మీద కేసు నమోదు.