Russian Missile Attack

Russian Missile Attack: ఉక్రెయిన్ మంత్రులే లక్ష్యంగా రష్యా దాడి.. ముగ్గురు మృతి..!

Russian Missile Attack: ఉక్రెయిన్ రాజధాని కైవ్ రాత్రి వేళ రష్యా డ్రోన్‌లు, క్షిపణులు ప్రయోగించింది. ఈ దాడుల్లో శిశువు సహా కనీసం ముగ్గురు ప్రాణాలు కోల్పోగా, 18 మంది గాయపడ్డారు. రాజధానిలోని ప్రభుత్వ కార్యాలయ భవనంతో పాటు అనేక అపార్ట్‌మెంట్‌లు మంటల్లో చిక్కుకున్నాయి.

కైవ్ మేయర్ విటాలి క్లిట్ష్కో వెల్లడించిన వివరాల ప్రకారం.. మొదట డ్రోన్ దాడులతో ప్రారంభమైన ఈ దాడి తరువాత మిస్సైల్  దాడులు కూడా చోటుచేసుకున్నాయి. పశ్చిమ జిల్లాలోని స్వియాటోషిన్స్కీ ప్రాంతంలో 16 అంతస్తుల అపార్ట్‌మెంట్ భవనం సహా రెండు నివాస సముదాయాల్లో మంటలు చెలరేగాయి. డ్నిప్రో నది తూర్పున ఉన్న డార్నిట్స్కీ జిల్లాలో డ్రోన్ శిథిలాల వల్ల నలుగురు  అపార్ట్‌మెంట్ లోనే మంటల్లో కాలిపోయింది.

ప్రత్యక్ష సాక్షులు, నగరంలో వరుస పేలుళ్లు విన్నట్లుగా తెలిపారు. ఈ దాడుల్లో అనేక భవనాల ముఖభాగాలు కూలిపోయి, విద్యుత్ సరఫరా కూడా నిలిచిపోయింది. ఉక్రెయిన్ మంత్రివర్గ భవనం పైకప్పు దెబ్బతినడం ఇదే మొదటిసారి అని ప్రధాన మంత్రి యులియా స్విరిడెంకో పేర్కొన్నారు.

క్రెమెన్‌చుక్, ఒడేసా, క్రివీ రిహ్ నగరాల్లోనూ దాడులు

రాజధానితో పాటు ఇతర ప్రాంతాలు కూడా లక్ష్యంగా మారాయి.

  • క్రెమెన్‌చుక్: డజన్లకొద్దీ పేలుళ్లు సంభవించాయి, కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ నిలిచిపోయింది.

  • క్రివీ రిహ్: రవాణా మరియు పట్టణ మౌలిక వసతులపై దాడులు జరిగాయి.

  • ఒడేసా: పౌర మౌలిక సదుపాయాలు, నివాస భవనాలు దెబ్బతిన్నాయి.

  • జపోరిజ్జియా: శనివారం జరిగిన డ్రోన్ దాడిలో 15 మంది గాయపడ్డారు.

ఇది కూడా చదవండి: Narendra Modi: పంజాబ్ దెబ్బతిన్న 15 రోజులు తర్వాత మోదీ పర్యటన.. పెరుగుతున్న విపక్షాల విమర్శలు.

పౌరులను లక్ష్యంగా చేసుకున్నారనే ఆరోపణలు

రష్యా ఈ దాడులపై స్పందించకపోయినా, ఉక్రెయిన్ అధికారులు రష్యా “ఉద్దేశపూర్వకంగా పౌరులను లక్ష్యంగా చేసుకుంటోంది” అని ఆరోపిస్తున్నారు. ఫిబ్రవరి 2022లో యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇరువైపులా వేలాది ప్రాణాలు కోల్పోయారు.

ఉక్రెయిన్ ప్రతిదాడి: రష్యన్ చమురు పైప్‌లైన్ నాశనం

ఇక మరోవైపు, ఉక్రెయిన్ డ్రోన్ దళాలు రష్యాలోని బ్రయాన్స్క్ ప్రాంతంలో ఉన్న డ్రుజ్బా చమురు పైప్‌లైన్‌పై దాడి చేశాయి. ఈ దాడితో పైప్‌లైన్‌కు “సమగ్ర అగ్ని నష్టం” జరిగినట్లు ఉక్రెయిన్ కమాండర్ రాబర్ట్ బ్రోవ్డి ప్రకటించారు. ఈ పైప్‌లైన్ రష్యన్ చమురును హంగేరీ, స్లోవేకియాకు సరఫరా చేస్తుంది.

పశ్చిమ దేశాల నుంచి మరిన్ని ఆంక్షల డిమాండ్

ప్రధానమంత్రి స్వైరిడెంకో, ప్రపంచం ఈ విధ్వంసానికి మాటలతో కాకుండా చర్యలతో స్పందించాలని, రష్యన్ చమురు, వాయువుపై ఆంక్షలను కఠినతరం చేయాలని కోరారు.

ALSO READ  Greta Thunberg: ఫ్యామిలీ బోట్.. గ్రెటా థన్‌బర్గ్‌ ప్రయాణిస్తున్న నౌకపై డ్రోన్‌ దాడి..

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *