CGS for Farmers

CGS for Farmers: చిన్న రైతులకు గుడ్ న్యూస్.. అదిరిపోయే పథకం ప్రారంభించిన కేంద్రం!

CGS for Farmers: చిన్న రైతులకు బ్యాంకులు నిస్సందేహంగా రుణాలు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం రూ.1,000 కోట్ల రుణ హామీ పథకాన్ని ప్రారంభించింది.

కేంద్ర ఆహార, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి ప్రకళత్ జోషి ఢిల్లీలో ఈ పథకాన్ని ప్రారంభించారు. దీని ప్రకారం, పంట కోత తర్వాత గోడౌన్ లో ధాన్యం నిల్వ చేసుకున్నపుడు ఇచ్చిన ఎలక్ట్రానిక్ రసీదుపై బ్యాంకులు రుణాలు ఇస్తాయి. ఈ రసీదు కలిగి ఉన్న చిన్న, సన్నకారు రైతులు రశీదు చూపితే రుణం పొందేందుకు అనుమతిస్తారు.


ఈ పథకం వ్యవసాయ రుణ పథకాల్లో కొత్త విప్లవాన్ని తీసుకువస్తుందని; రైతులకు రుణాలు ఇవ్వడానికి బ్యాంకులు వెనుకాడడం కూడా తగ్గుతుందని మంత్రి ప్రగలద్ జోషి అన్నారు.

ఇది కూడా చదవండి: Congo: ఘోర ప్రమాదం.. పడవ బోల్తా పడి 25 మంది మృతి


CGS for Farmers: చిన్నకారు రైతులు పండించిన పంటకు మార్కెట్‌లో గిట్టుబాటు ధర లభించక పోయినా తర్వాతి పంటను వేయాల్సి రావడంతో నష్టాల పాలవుతున్నారు. అదేవిధంగా తరువాత పంట వేసుకోవడానికి చేతిలో డబ్బులు లేక ఇబ్బందులు పాడడం జరుగుతోంది. దీనికోసం స్థానికంగా ఉండే వడ్డీ వ్యాపారుల వద్ద అధిక వడ్డీకి అప్పులు చేసి అప్పుల పాలవుతున్నారు. అటువంటి వారు ఈ పథకం కింద తమ ఉత్పత్తులను గోదాముల్లో ఉంచి రశీదు చూపిస్తే తదుపరి పంట సాగుకు రుణం పొందవచ్చు.

 

తమ ఉత్పత్తులకు సరైన ధర లభించినప్పుడు గోదాముల్లోనే విక్రయించి నష్టాలను నివారించవచ్చని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. ఈ పథకం ద్వారా బ్యాంకులు గిడ్డంగి రశీదులను తాకట్టుగా పరిగణించి రైతులకు ఎటువంటి సందేహం లేకుండా రుణాలు ఇవ్వడానికి సహాయం చేస్తుంది. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం రూ.1000 కోట్ల నిధి నుంచి బ్యాంకులకు రుణ గ్యారెంటీలను అందజేస్తుంది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *