Road Accident: హైదరాబాద్ శివారులోని మైలార్దేవర్పల్లిలో ఆదివారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్తున్న ఎనిమిదేళ్ల బాలుడిని టిప్పర్ (Dumper) లారీ ఢీకొట్టడంతో బాలుడు అక్కడికక్కడే మృతిచెందాడు. తాజాగా విడుదలైన ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ స్థానికులను, పోలీసులను దిగ్భ్రాంతికి గురిచేసింది.
వెనుక టైరు కింద పడి విషాదం
శాస్త్రీపురం ప్రాంతానికి చెందిన సయ్యద్ రేయానుద్దీన్ (8) అనే బాలుడు ఆదివారం సాయంత్రం తన స్నేహితులతో కలిసి రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్తున్నాడు.
ఈ క్రమంలో వెనుక నుంచి వేగంగా వచ్చిన టిప్పర్ లారీ, అకస్మాత్తుగా ఎడమవైపునకు మళ్లింది. లారీ మలుపు తిరుగుతుండగా బాలుడు దాని వెనుక టైర్ కింద పడిపోయాడు.
ఇది కూడా చదవండి: Digital Gold: సెబీ వార్నింగ్.. మీరు డిజిటల్ గోల్డ్ కొంటున్నారా.. ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోండి
ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే స్పందించి, తీవ్రంగా గాయపడిన బాలుడిని దవాఖానకు తరలించారు. అయితే, చికిత్స ప్రారంభించేలోపే బాలుడు మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు.
ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. టిప్పర్ డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనతో బాలుడి కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
సీసీటీవీ ఫుటేజ్
రాజేంద్రనగర్ లో తీవ్ర విషాదం
మట్టి లారీ కింద పడి 8 ఏళ్ల బాలుడు మృతి
హైదరాబాద్ –రాజేంద్రనగర్ మైలార్ దేవరపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డుపై నడుస్తుండగా, మట్టి లారీ టైర్ కింద పడి మృతి చెందిన రియాన్ ఉద్దీన్(8) అనే బాలుడు
టిప్పర్ డ్రైవర్ నిర్లక్ష్యంతోనే ఈ… pic.twitter.com/5C1M0KhJvm
— Telugu Scribe (@TeluguScribe) November 9, 2025

