రిషబ్ పంత్‌ సెంచరీ .. భారీ స్కోర్ దిశగా టీమిండియా

బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా ఆటగాడు రిషబ్ పంత్‌ సెంచరీ బాదాడు. 124 బంతుల్లోనే పంత్ సెంచరీని కంప్లీట్ చేయడం విశేషం. ఈ క్రమంలో ఆరు సెంచరీలతో ధోనీ (6)రికార్డును పంత్ సమం చేశాడు. మూడో రోజు ఆట ప్రారంభంలో పిచ్‌ పేస్‌కు అనుకూలంగా ఉండటంతో భారత బ్యాటర్లు రిషభ్‌ పంత్ – గిల్ ఆచితూచి ఆడారు. సింగిల్స్‌తో స్ట్రైక్‌ను రొటేట్ చేస్తూ వచ్చారు. క్రీజ్‌లో కుదరుకున్నాక.. ఒక్కసారిగా జోరు పెంచారు. భారత్‌ ప్రస్తుతం 244/4 పరుగులు చేసి 471 పరుగుల లీడ్‌లో ఉంది. గిల్‌ (97*) పరుగులు చేశాడు. బంగ్లా బౌలర్లలో తస్కీన్‌ అహ్మద్‌, నహీద్‌ రానా చెరో వికెట్‌ తీయగా.. మెహిదీ హసన్‌ మిరాజ్‌ రెండు వికెట్లు తీశాడు. అంతకుముందు తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ 376, బంగ్లాదేశ్‌ 149 పరుగులు చేసిన విషయం తెలిసిందే.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *