Nepal Protest

Nepal Protest: రాజ్యాంగాన్ని తిరిగి రాయాలి.. ‘జెన్‌ జెడ్‌’ నిరసనకారుల డిమాండ్

Nepal Protest: నేపాల్ రాజకీయ చరిత్రలో అరుదైన ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రధాని కె.పి. శర్మ ఓలి రాజీనామా చేసి దేశం విడిచి వెళ్లినప్పటికీ, ప్రజా ఆగ్రహం మాత్రం శాంతించలేదు. ఖాట్మండు సహా దేశవ్యాప్తంగా జెన్‌జడ్ యువత ముందుండి విస్తృత ప్రభుత్వ వ్యతిరేక నిరసనలను కొనసాగిస్తోంది. గత మూడు దశాబ్దాలుగా రాజకీయ నేతలు దోచుకున్న ఆస్తులపై దర్యాప్తు చేయాలని, పాలనలో నిర్మాణాత్మక మార్పులు తీసుకురావాలని నిరసనకారులు బహిరంగంగా డిమాండ్ చేస్తున్నారు.

కీలక డిమాండ్లు:

  • ప్రతినిధుల సభ రద్దు: ప్రస్తుత పార్లమెంట్‌పై ప్రజల నమ్మకం పూర్తిగా కోల్పోయిందని నిరసనకారుల అభిప్రాయం.

  • రాజ్యాంగ సవరణ లేదా తిరిగి రచించాలి: నిపుణులు, పౌరులు, యువతతో కూడిన కొత్త రాజకీయ వ్యవస్థ ప్రతిపాదన.

  • స్వతంత్ర ఎన్నికలు: తాత్కాలిక పాలన అనంతరం ప్రజల ప్రత్యక్ష భాగస్వామ్యంతో న్యాయమైన ఎన్నికలు నిర్వహించాలని పిలుపు.

  • ప్రత్యక్ష నాయకత్వం: ప్రజల చేత నేరుగా ఎన్నికైన కార్యనిర్వాహక నాయకత్వాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్.

  • అక్రమ ఆస్తుల జాతీయీకరణ: గత మూడున్నర దశాబ్దాలుగా అవినీతి ద్వారా సొంతం చేసుకున్న ఆస్తులపై దర్యాప్తు చేసి వాటిని దేశానికి చెందించాలని డిమాండ్.

  • విద్య, ఆరోగ్యం, న్యాయం, భద్రత, కమ్యూనికేషన్లలో సంస్కరణలు: ఈ రంగాలలో నిర్మాణాత్మక మార్పులు అవసరమని నిరసనకారులు హెచ్చరించారు.

ఇది కూడా చదవండి: Cockroach In Mandi: బిర్యానీలో బొద్దింక.. ఏం కాదులే అన్న ఓనర్.. ఎక్కడంటే.. ?

సైన్యం రంగప్రవేశం:

నేపాల్ రాజధాని ఖాట్మండు, లలిత్‌పూర్, భక్తపూర్ నగరాల్లో పరిస్థితి అదుపు తప్పడంతో బుధవారం తెల్లవారుజాము నుంచి సైనిక దళాలు మోహరించాయి. దేశవ్యాప్తంగా నిర్బంధ ఆదేశాలు అమల్లోకి వచ్చాయి. సైన్యం ప్రకటనలో “కొన్ని సమూహాలు క్లిష్ట పరిస్థితిని దుర్వినియోగం చేసి సాధారణ పౌరులకు, ప్రభుత్వ ఆస్తులకు భారీ నష్టం కలిగిస్తున్నాయి” అని ఆందోళన వ్యక్తం చేసింది.

నిరసనల తీవ్రత:

సోమవారం జరిగిన అవినీతి వ్యతిరేక ర్యాలీలలో కనీసం 22 మంది ప్రాణాలు కోల్పోవడం పరిస్థితిని మరింత కఠినతరం చేసింది. ఆ ఘటనల తర్వాత ఓలి తన పదవికి రాజీనామా చేసి దేశం విడిచి వెళ్లడం జరిగింది. అయినప్పటికీ, నిరసనకారులు పార్లమెంట్ భవనంలోకి దూసుకెళ్లి దానికి నిప్పు పెట్టడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది.

ఉద్యమం పిలుపు:

“మా ఉద్యమం ఏ ఒక్క పార్టీ లేదా నేత కోసం కాదు. ఇది మొత్తం తరం, దేశ భవిష్యత్తు కోసం. శాంతి అవసరం, కానీ అది కొత్త రాజకీయ వ్యవస్థ పునాదిపై మాత్రమే సాధ్యం,” అని నిరసనకారులు ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. నిరసనలో ప్రాణాలు కోల్పోయిన వారిని అమరవీరులుగా గుర్తించి, వారి కుటుంబాలకు రాష్ట్ర గౌరవం, గుర్తింపు, సహాయం అందించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

ALSO READ  Salman Khan: సల్మాన్ ఖాన్‌ ఇంటికి బుల్లెట్‌ ప్రూఫ్‌ గ్లాస్‌

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *