Telangana Secretariat

Telangana Secretariat: తెలంగాణ సెక్రటేరియట్‌ బాహుబలి గేటు తొలగింపు

Telangana Secretariat: తెలంగాణ సచివాలయంలో వాస్తు మార్పుల పనుల్లో వేగం పెరిగింది. డిసెంబర్ 9న తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ చేయనున్న నేపథ్యంలో అధికారులు పనుల్లో వేగం పెంచారు. వాస్తవానికి సచివాలయానికి ఎదురుగా తూర్పువైపు ఉన్న ప్రధాన మహా ద్వారాన్ని ప్రభుత్వం ఆరు నెలల కిందటే మూసివేసింది. వాస్తు మార్పుల్లో భాగంగా ఈ ఏడాది జూన్‌ నుంచే గేటుకు తాళం వేశారు. ఆ మార్గం నుంచి ఎలాంటి రాకపోకలు జరగడం లేదు. పొరబాటున కూడా గేటు తెరువకుండా ఏకంగా ఇనుప తీగలు చుట్టేశారు. నిన్న మహాద్వారం గేట్లను తొలిగించారు. ద్వారాన్ని కూడా తొలిగించనున్నారు. చుట్టూ ఉన్నట్టుగానే రెయిలింగ్‌ ఏర్పాటు చేస్తారు. ప్రధాన ద్వారాన్ని ఈశాన్యం వైపు జరిపి ఉత్తరం ద్వారానికి సమీపంలో నిర్మిస్తారు. ఈ మేరకు ఇప్పటికే అక్కడ రెయిలింగ్‌ను తొలిగించారు.

Telangana Secretariat: వాస్తు మార్పుల్లో భాగంగా రోడ్డు పనులు వేగంగా సాగుతున్నాయి. ప్రధాన ద్వారం ఉన్న ప్రహరీకి ఆనుకొని ఉన్న గేట్‌-2,నుంచి గేట్‌-4ని కలుపుతూ 27 అడుగుల వెడల్పుతో రోడ్డు నిర్మిస్తున్నారు. మొత్తంగా ఈ పనులకు ప్రభుత్వం 3.20 కోట్లు ఖర్చు చేస్తున్నది. పనులు పూర్తయిన తర్వాత సీఎం రేవంత్‌ రెడ్డి కొత్తగా ఏర్పాటు చేస్తున్న ఈశాన్య మార్గం ద్వారా రాకపోకలు సాగిస్తారని అధికార వర్గాలు తెలిపాయి. మంత్రులు సైతం ఇదే మార్గాన్ని వినియోగించనున్నారు. ఈశాన్య గేటు కోసం ఇప్పటికే రెయిలింగ్ తొలగించి పనులు వేగం చేశారు. ఈశాన్యం గేటు పశ్చిమ గేటు ఎదురుగా వచ్చేట్టు ఏర్పాటు చేశారు. కొత్త గేటు నార్త్ పోర్టిగోకు నేరుగా వెళ్తుంది. ఈ ఎంట్రీ నుంచే సెక్రటేరియట్ ఉద్యోగులు ఇప్పటివరకు రాకపోకలు సాగిస్తున్నారు. ఈశాన్యం వైపు రెండు గేట్లు పక్క పక్కనే రానుండడంతో ఏమైనా భద్రతాపరమైన ఇబ్బందులు ఉంటాయా అనే కోణంలో ఆలోచన చేస్తున్నారు. ఉద్యోగులకు సౌత్ ఎంట్రీపై ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లు సమాచారం.

Telangana Secretariat: సీఎం రేవంత్‌ రెడ్డి అధికారం చేపట్టిన తర్వాత ఇప్పటికే పలుసార్లు వాస్తు మార్పులు చేశారు. మొదట సీఎం కాన్వాయ్‌లోని తెలుపు కార్లను తొలిగించి, నలుపు రంగు కార్లు తెచ్చిపెట్టారు. సీఎం రేవంత్‌ రెడ్డి అదృష్ట సంఖ్య 9 అని, కాన్వాయ్‌లో 9 కార్లు, వాటి నంబర్‌ ప్లేట్లపై 9 అంకె వచ్చేలా చూసుకున్నారు. మొదట్లో తూర్పువైపు మహాద్వారం మీదుగా రేవంత్‌ రాకపోకలు సాగించేవారు. కానీ పాలన గాడిన పడకపోవడంతో వాస్తు మార్పుల్లో భాగంగా జూన్‌లో ఆ గేటును మూసివేశారు. పశ్చిమం గేటు ద్వారా రాకపోకలు ప్రారంభించారు. సీఎం కార్యాలయంలోనూ వాస్తు మార్పులు చేపట్టారు. మంత్రుల ఛాంబర్లలోనూ వాస్తు మార్పులు చేశారు. సచివాయలంలోని 6వ అంతస్తులో సీఎం కార్యాలయం ఉంటుంది. అయితే సీఎం రేవంత్‌ తన అదృష్ట సంఖ్యకు అనుగుణంగా సచివాలయంలోని 9వ అంతస్తులోకి సీఎంవోను మార్చాలని భావించారు. పలుసార్లు 9వ అంతస్తులో ఏర్పాట్లను పరిశీలించారు. భద్రతాపరంగా, సాంకేతికంగా తరలింపు సాధ్యం కాదని అధికారులు తేల్చడంలో తాత్కాలికంగా ఆ ప్రతిపాదనను విరమించుకున్నట్టు తెలిసింది.

ALSO READ  Bank Holidays in August 2025: ఆగస్టులో సెలవులే సెలవులు.. 15 రోజులు హాలిడేస్

Telangana Secretariat: అయితే సెక్రటేరియట్ లోపలి మెయిన్ ఎంట్రెన్స్ ముందు తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నందున ఇప్పటి వరకు ఉన్న రోడ్డు పూర్తిగా కనుమరుగు కానుంది. నార్త్ ఈస్ట్ నుంచి సౌత్ ఈస్ట్ గేట్ వరకు రోడ్ కనెక్టివిటీ లేదు కాబట్టి సౌలభ్యం కోసం పలు మార్పులు చేస్తున్నామని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. వాస్తు మార్పులా..? తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేస్తున్నందుకు చేస్తున్న మార్పులా..? ప్రభుత్వం నుండి క్లారిటీ రావాల్సి ఉంది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *