AP News

AP News: ఏపీ తోతాపురి మామిడి రైతులకు భారీ ఊరట..

AP News: ఆంధ్రప్రదేశ్‌లో తోతాపురి మామిడి రైతులకు పెద్ద ఉపశమనం లభించింది. క్వింటాల్‌ మామిడికి మార్కెట్‌ ఇంటర్వెన్షన్‌ ధరను రూ.1,490గా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.

ఈ ధరను కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం 50:50 నిష్పత్తిలో చెల్లించనున్నాయి. రైతుల బ్యాంక్‌ ఖాతాల్లో నేరుగా ఈ రుసుములు జమ కానున్నాయని అధికారులు తెలిపారు.

ఈ నిర్ణయంతో మామిడి రైతులు ఆనందం వ్యక్తం చేశారు. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం, సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌కు రైతులు కృతజ్ఞతలు తెలిపారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *