Rashmika Mandanna: రీసెంట్గా పుష్ప 2 మూవీతో బాక్సాఫీస్ దగ్గర సెన్సేషనల్ హిట్ అందుకుంది రష్మిక మందన్న. గతేడాది యానిమల్ మూవీలో రణ్బీర్ కపూర్ సరసన హీరోయిన్గా రష్మిక నటించగా, ఆ మూవీ కూడా బ్లాక్బస్టర్ హిట్ అయ్యింది. ఇలా ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర బ్యాక్ టు బ్యాక్ రెండు బ్లాక్బస్టర్స్ అందుకున్న రష్మిక ప్రస్తుతం హ్యాట్రిక్ విజయంపై కన్నేసింది. బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్ హీరోగా తెరకెక్కిన హిస్టారికల్ మూవీ ఛావా ఫిబ్రవరి 14న గ్రాండ్ రిలీజ్ కానుంది. ఈ సినిమాలో విక్కీ కౌశల్ ఛత్రపతి శంభాజీ మహారాజ్ పాత్రలో నటిస్తుండగా, రష్మిక మహారాణి యేసు భాయి పాత్రలో నటిస్తోంది. ఈ సినిమాపై బాలీవుడ్ వర్గాల్లో భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. దీంతో ఈ సినిమాతో రష్మిక కచ్చితంగా పాన్ ఇండియా హ్యాట్రిక్ హిట్ ని అందుకోవడం ఖాయమని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

