Rashmika Mandanna: స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న టాలీవుడ్లో తిరుగులేని రాణిగా రాణిస్తోంది. 11 సినిమాల్లో 8 హిట్స్తో ఆమె సత్తా చాటుతోంది. 2016లో కన్నడ చిత్రం ‘కిరిక్ పార్టీ’తో డెబ్యూ చేసిన రష్మిక, ‘ఛలో’తో తెలుగు తెరకు పరిచయమైంది. ‘గీత గోవిందం’తో బ్రేక్త్రూ సాధించి, ఫిల్మ్ఫేర్ క్రిటిక్స్ అవార్డ్ను గెలుచుకుంది. ‘సరిలేరు నీకెవ్వరు’, ‘భీష్మ’ వంటి చిత్రాలతో వరుస విజయాలు అందుకుంది.
Also Read: Kannappa Twitter Review: కన్నప్ప ట్విట్టర్ రివ్యూ.. ప్రేక్షకుల మనసు గెలిచిందా?
Rashmika Mandanna: ‘పుష్ప 2′,’ ఛావా’ సినిమాలతో పెద్ద పాన్ ఇండియా హీరోయిన్ గా మారింది. ఇక ఇటీవల ‘కుబేర’ మూవీతో మరో హిట్ను ఖాతాలో వేసుకుని, నాగార్జున నుంచి ‘శ్రీదేవి’తో పోలికలు అందుకుంది. రష్మిక నటనా ప్రతిభ, స్క్రీన్ ప్రెజెన్స్ ఆమెను సౌత్ ఇండియాలో అగ్రగామిగా నిలిపాయి. మొత్తానికి వరుస హిట్లు అందుకుంటూ టాలీవుడ్ కి గోల్డెన్ బ్యూటీగా నిలిచింది.
