Ramchandra rao: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్రావు పార్టీ నేతలకు కఠిన హెచ్చరిక జారీ చేశారు. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించినా, పార్టీ సిద్ధాంతాలకు విరుద్ధంగా ప్రవర్తించినా ఎంతటి నాయకులైనా కఠిన చర్యలు తప్పవని ఆయన స్పష్టం చేశారు.
తాజాగా విడుదల చేసిన లేఖలో రామచందర్రావు పేర్కొన్నారు– పార్టీకి వ్యతిరేకంగా ప్రకటనలు చేయడం ద్వారా కార్యకర్తల్లో గందరగోళం సృష్టించడాన్ని భరించబోమని హెచ్చరించారు. పార్టీ ప్రతిష్ఠకు భంగం కలిగించే ప్రయత్నాలు జరిగితే “ఎవరైనా సరే, వదలమన్న మాట లేదు” అని తేల్చిచెప్పారు.
అలాగే పార్టీకి నిబద్ధతతో పనిచేయడం ప్రతి కార్యకర్త, నాయకుడి బాధ్యత అని గుర్తుచేశారు. పార్టీ ఆదేశాలు, విధానాల ప్రకారం మాత్రమే ప్రజా వ్యాఖ్యలు చేయాలని సూచించారు.