తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.ఆంధ్ర ప్రదేశ్, యానంలో దిగువ ట్రోపో ఆవరణములో పశ్చిమ -వాయువ్య దిశగా గాలులు వీస్తున్నాయని.. దీని ప్రభావంతో ఏపీలో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.ఉరుములతో కూడిన జల్లులు ఒకటి, రెండు చోట్ల కురిసే అవకాశముంది.
ఇవాళ ఈ ప్రాంతాల్లో ఈ ప్రాంతాల్లో వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ తెలిపింది.శ్రీకాకుళం, విజయనగరం, గుంటూరు, బాపట్ల, పల్నాడు, నెల్లూరు, అనంతపురం, వైయస్ఆర్ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలో అల్లూరి, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, ప్రకాశం, కర్నూలు, నంద్యాల, శ్రీ సత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.I