Rahul Gandhi: మోడీ ట్రంప్ బెదిరింపులకు భయపడ్డారు

Rahul Gandhi: భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీపై కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ మరోసారి విమర్శలు గుప్పించారు. జూన్ 3న మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్న రాహుల్, ప్రధాని మోడీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ముఖ్యంగా “ఆపరేషన్ సింధూర్” ఘటనకు సంబంధించి ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి.

ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ, “అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన బెదిరింపులకు మోడీ భయపడ్డారు. ‘నరేందర్… సరెండర్’ అన్న మాటలతోనే ఆయన గుండె వణికిపోయింది” అని ఎద్దేవా చేశారు. ట్రంప్ ఒత్తిడి వల్లే మోడీ పాకిస్తాన్‌తో కాల్పుల విరమణను ప్రకటించారని ఆరోపించారు.

ఇంకా రాహుల్ మాట్లాడుతూ, పాకిస్తాన్‌తో గతంలో యుద్ధ సమయంలో ప్రధాని ఇందిరా గాంధీ ఎలాంటి భయానికీ లోనుకాలేదని గుర్తు చేశారు. “చైనా, పాకిస్తాన్‌లకు భారత్ సత్తా ఏంటో ఇందిరా గాంధీ చూపించారు. కానీ ఇప్పుడు బీజేపీ, ఆర్ఎస్ఎస్ నేతలకు సరెండర్ కావడం అలవాటైంది,” అంటూ తీవ్రంగా విమర్శించారు.

ఇదిలా ఉంటే, పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం భారత సైన్యం నిర్వహించిన “ఆపరేషన్ సింధూర్” పై కూడా రాహుల్ గాంధీ ఇప్పటికే సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆపరేషన్‌కు ముందు కేంద్ర ప్రభుత్వం పాకిస్తాన్‌కు సమాచారం ఇచ్చినట్లు ఆయన ఆరోపించిన ట్వీట్ దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపింది. ఇప్పటికీ ఆ వ్యాఖ్యల ప్రభావం చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో, తాజాగా ఆయన చేసిన విమర్శలు మరింత దృష్టిని ఆకర్షిస్తున్నాయి.

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *