Delhi: భారత ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్ ఘనవిజయం సాధించారు. ఈ ఎన్నికల్లో రాధాకృష్ణన్కు 452 ఓట్లు లభించగా, ఇండియా కూటమి అభ్యర్థి సుదర్శన్రెడ్డికి 300 ఓట్లు వచ్చాయి.
మొదటి ప్రాధాన్యత ఓట్లతోనే స్పష్టమైన ఆధిక్యం సాధించిన రాధాకృష్ణన్ విజయం ఖరారైంది. దీంతో ఆయన అధికారికంగా భారత ఉపరాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించనున్నారు.
ఈ విజయంతో ఎన్డీఏ శ్రేణుల్లో హర్షం వ్యక్తమవుతోంది. మరోవైపు, రాబోయే రాజకీయ పరిణామాల్లో రాధాకృష్ణన్ కీలక పాత్ర పోషించే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
