AP Crime

AP Crime: కడప జిల్లాలో మద్యం మత్తులో దారుణం

AP Crime: మందు తాగాడు , ఇంటికి వచ్చాడు..భార్యను కూతుర్ని చంపేశాడు. తెల్లారింది పోలీసులు వచ్చారు ..పట్టుకుపోయారు. ఇంతలో ఎందుకు చంపాడు ? తెలియదు. ఇంట్లో ఆ ముగ్గురే ఉంటారు. కానీ కన్న కూతురిని కూడా కొడవలితో చంపేంత కోపం దేనికి. లేక తాగిన మైకంలో …చిన్న మాటకు చంపేశాడా ?

ఏపీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. కడప జిల్లాలో మద్యం మత్తులో తల్లీ కూతుర్ని దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన పులివెందల నియోజకవర్గంలో కలకలం రేపుతోంది. తొండూరు మండలం తుమ్మలపల్లిలో గంగాధర్‌రెడ్డి.. భార్య, కూతురు నివాసం ఉంటున్నారు. అయితే సోమవారం రాత్రి ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ.. గంగాధర్‌రెడ్డి ఫుల్ల్‌గా తాగి ఇంటికి వచ్చాడు. అనంతరం భార్య శ్రీలక్ష్మీ, కుమార్తె గంగోత్రిని కొడవలితో నరికి చంపాడు.

తర్వాత అతను పారిపోయాడు. స్థానికులు శ్రీలక్ష్మీ, గంగోత్రి మృతి చెందిన విషయాన్ని పోలీసులకు సమాచారం అందించారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. అనంతరం సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. తీవ్ర గాయాలతో మృతి చెందిన తల్లీ కూతుర్ల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పరారైన నిందితుడు కోసం గాలిస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు. భార్యాభర్తలకు ఏమైనా గోడలున్నాయా..? ఆస్తి తగాదాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో విచారణ చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *