Priyanka Gandhi: ఢిల్లీ వెదర్ ఫై ప్రియాంక గాంధీ హాట్ కామెంట్స్

Priyanka Gandhi: ఢిల్లీ వెదర్ పై కీలక వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ నాయకురాలు ప్రియన్య గాంధీ.ఢిల్లీలో కాలుష్యం ఎప్పటికప్పుడు పెరుగుతోందన్నారు. పిల్లలు, వృద్ధులు, శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్న వారికి ఇది ఎంతో క్లిష్టమైన పరిస్థితి అన్నారు. పరిశుభ్రమైన గాలి కోసం అందరం కలిసి పార్టీలకు అతీతంగా పని చేయాల్సి ఉందని సూచించారు. వయనాడ్‌లో వాయు నాణ్యత సూచీ 35గా ఉండగా, ఇక్కడ మాత్రం ఓ గ్యాస్ ఛాంబర్‌లోకి ప్రవేశించినట్లుగా కనిపిస్తోందన్నారు. కేరళలోని వయనాడ్ నుంచి ఢిల్లీ తిరిగి వచ్చానని ఇక్కడి వాతావరణ కాలుష్యం ఆందోళన కలిగిస్తోందన్నారు.

కాగా, ఢిల్లీలో కాలుష్యం ఘోరంగా ఉందని నిపుణులు చెబుతున్నారు. వరుసగా రెండో రోజు వాయునాణ్యత సూచీ 400 దాటింది. గురువారం ఉదయం వాయు నాణ్యత 428గా నమోదైంది. దీంతో ఢిల్లీ-ఎన్సీఆర్ పరిధిలో గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్-3 అమలు చేస్తున్నట్లు ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ ప్రకటించింది. ఈ ఆంక్షలు నేటి నుంచి అమల్లోకి వచ్చాయి. ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా దాదాపు 300 విమాన సర్వీసులు ఆలస్యమైనట్లు అధికారులు తెలిపారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *