PM Modi

PM Modi: ఒబేసిటీకి వ్యతిరేకంగా ప్రధాని మోదీ ప్రచారం.. కార్యక్రమానికి ఒమర్ అబ్దుల్లా సహా 10 మంది నామినేట్

PM Modi: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సోమవారం నాడు స్థూలకాయానికి వ్యతిరేకంగా ఒక ప్రచారాన్ని ప్రారంభించారు. దీనికోసం ఆయన వివిధ రంగాలకు చెందిన 10 మంది ప్రముఖ వ్యక్తులను నామినేట్ చేశారు. వీటిలో జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా, మను భాకర్ వంటి వ్యక్తుల పేర్లు ఉన్నాయి. ఈ ప్రచారం ద్వారా నామినేట్ అయిన వ్యక్తులు ఊబకాయానికి వ్యతిరేకంగా ప్రజలలో అవగాహన కల్పించడానికి పని చేస్తారు. దీని కోసం, వారు పది మంది మరో పది మందిని నామినేట్ చేయాల్సి ఉంటుంది. ఇలా ప్రచారం క్రమంగా ఎక్కువ మందికి చేరుతుంది. ఫిబ్రవరి 23న, మన్ కీ బాత్ కార్యక్రమంలో, ప్రధానమంత్రి ఊబకాయానికి వ్యతిరేకంగా ప్రచారం ప్రారంభించడం గురించి మాట్లాడారు.

ఈ విషయంపై ప్రధాని మోదీ మాట్లాడుతూ “నిన్నటి మన్ కీ బాత్ లో చెప్పినట్లుగా, ఊబకాయంపై పోరాటాన్ని బలోపేతం చేయడానికి, ఆహారంలో తినదగిన నూనె వినియోగాన్ని తగ్గించడం గురించి అవగాహన కల్పించడానికి నేను ఈ క్రింది వ్యక్తులను నామినేట్ చేయాలనుకుంటున్నాను. మన ఉద్యమం పెద్దదిగా మారడానికి ఒక్కొక్కరు 10 మందిని నామినేట్ చేయాలని కూడా నేను వారిని అభ్యర్థిస్తున్నాను.” అని పేర్కొన్నారు.

Also Read: Elephant Attack: ఏనుగుల గుంపు బీభ‌త్సం.. ఐదుగురు భ‌క్తుల మృతి.. ప‌వ‌న్ కల్యాణ్ దిగ్భ్రాంతి.. 10 ల‌క్ష‌ల ఎక్స్‌గ్రేషియా

దీనికి ప్రతిస్పందనగా అబ్దుల్లా మాట్లాడుతూ- ప్రధాని మోదీ నామినేట్ అయినందుకు సంతోషంగా ఉందని చెప్పారు. జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా తన ఫిట్‌నెస్ విషయంలో తరచుగా సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటారు. ఆయన ప్రతిరోజూ తన వ్యాయామాల వీడియోలను సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో పంచుకుంటారు. ఇటీవల, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్థూలకాయానికి వ్యతిరేకంగా చేపట్టిన ప్రచారంలో నామినేట్ కావడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు.

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Jagan Alert: ఈ ఆరాటమంతా సతీమణిని తప్పించేందుకేనా?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *