Posani Krishna Murali:సినీ నటుడు పోసాని కృష్ణ మురళికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రైల్వే కోడూరు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఈ మేరకు ఆయనను శుక్రవారం కడప జిల్లా రాజంపేట సెంట్రల్ జైలుకు ఆయనను తరలించారు. గురువారం అన్నమయ్య జిల్లా ఓబులవారి పల్లె పోలీస్ స్టేషన్లో జిల్లా ఎస్పీ విద్యాసాగర్ ఆధ్వర్యంలో సుమారు 9 గంటల పాటు విచారించిన పోలీసులు రాత్రి జడ్జి ముందు హాజరుపరిచారు.
Posani Krishna Murali: రాత్రి 9.30 గంటల నుంచి ఈ రోజు తెల్లవారుజామున ఉదయం వరకు కోర్టులో సుదీర్ఘ వాదనలు కొనసాగాయి. పోసాని తరఫున పొన్నవోలు సుధాకర్రెడ్డి వాదనలు వినిపిస్తూ, ఆయనకు బెయిల్ మంజూరు చేయాలని కోరారు. అందుకు న్యాయమూర్తి నిరాకరించారు. దీంతో పోసాని మార్చి 13 వరకు రిమాండ్లోనే ఉండనున్నారు. ఇదిలా ఉండగా పోసాని కృష్ణ మురళిని ఆంధ్రప్రదేశ్ పోలీసులు బుధవారం హైదరాబాద్లోని ఆయన నివాసంలో అరెస్టు చేశారు.