Pm modi: ఏపీ పర్యటనకు ప్రధాని మోదీ సిద్ధం – ₹13,400 కోట్ల ప్రాజెక్టుల శంకుస్థాపన

Pm modi: ప్రధాని నరేంద్ర మోదీ రేపు ఆంధ్రప్రదేశ్ పర్యటనకు రానున్నారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్‌’ (ట్విట్టర్) ద్వారా ప్రకటించారు.

మోదీ తన ట్వీట్‌లో పేర్కొంటూ> “రేపు, అక్టోబర్ 16న నేను ఆంధ్రప్రదేశ్‌లో ఉంటాను. శ్రీశైలంలోని శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానంలో ప్రార్థనలు చేస్తాను. అనంతరం కర్నూలులో ₹13,400 కోట్లకు పైగా విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాల్లో పాల్గొంటాను. ఈ ప్రాజెక్టులు విద్యుత్, రైల్వేలు, పెట్రోలియం, రక్షణ, పరిశ్రమలతో పాటు మరిన్ని రంగాలకు సంబంధించినవి” అని వెల్లడించారు.

ప్రధాని పర్యటనను పురస్కరించుకుని కర్నూలు జిల్లాలో భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. భద్రతా చర్యలను కేంద్ర, రాష్ట్ర పోలీసు విభాగాలు సమన్వయంగా పర్యవేక్షిస్తున్నాయి.

ప్రధాని సందర్శనతో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కార్యక్రమాలకు కొత్త ఊపు లభిస్తుందని, ముఖ్యంగా కర్నూలు ప్రాంతానికి పరిశ్రమల పరంగా మరిన్ని అవకాశాలు సృష్టించబడతాయని అధికారులు భావిస్తున్నారు.

మోదీ పర్యటనపై ప్రజల్లో కూడా ఉత్సాహం నెలకొంది. శ్రీశైలంలో జరిగే ఆయన దర్శనం, కర్నూలులో జరిగే కార్యక్రమాలు రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక ఆకర్షణగా మారనున్నాయి.

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *