Pm modi: భారత సైన్యానికి, శాస్త్రవేత్తలకు సెల్యూట్ 

Pm modi: దేశ రక్షణ కోసం జరిగిన ఆపరేషన్ సిందూర్ విజయవంతంగా పూర్తయిన నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత సైన్యం చేసిన వీర కార్యాచరణను ప్రధాని ప్రశంసిస్తూ, శాస్త్రవేత్తలు, సైనికులకు తన హృదయపూర్వక అభినందనలు తెలిపారు.

భారత సైన్యం ధైర్యాన్ని ప్రదర్శించింది

ఆపరేషన్ సిందూర్‌లో భారత సైన్యం చూపిన సహసాన్ని ప్రధాని ప్రశంసించారు. “భారత సైన్యానికి, శాస్త్రవేత్తలకు సెల్యూట్ చేస్తున్నా. మన బలగాలు ఎంతో ధైర్యాన్ని ప్రదర్శించాయి. దేశ ప్రజల తరఫున సైన్యానికి నా అభినందనలు,” అని మోదీ పేర్కొన్నారు.

పహల్గామ్ ఉగ్రదాడి పై తీవ్ర వ్యాఖ్యలు

పహల్గామ్ దాడిలో పర్యాటకులను లక్ష్యంగా ఉగ్రవాదులు దాడి చేయడం చాలా దారుణమని మోదీ అన్నారు. “కుటుంబ సభ్యుల ముందే హత్య జరగడం నాకు వ్యక్తిగతంగా ఎంతో బాధాకరమైన విషయం. దేశం మొత్తం ఈ చర్యను ఖండించింది,” అని అన్నారు.

ఉగ్రవాదులపై నిర్ణయాత్మక చర్యలు

“ఉగ్రవాదులను మట్టిలో కలిపేందుకు సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చాం. దేశ మహిళల సిందూరాన్ని తుడిచేస్తే ఎలా ఉంటుందో వారికి చూపించాం. ఆపరేషన్ సిందూర్ ఒక పేరు కాదు, అది ఒక ఆవేదన, న్యాయం కోసం చేసిన ప్రతిజ్ఞ. ఆ ప్రతిజ్ఞ ఏడో తేదీ తెల్లవారుజామున నెరవేరింది. ప్రపంచం మొత్తం చూసింది,” అని మోదీ వివరించారు.

పాకిస్తాన్ ఉగ్రస్థావరాలపై దాడులు

భారత సైన్యం పాకిస్తాన్‌లోని ఉగ్రవాదుల స్థావరాలపై దాడి చేసిన విషయాన్ని ప్రధాని ధృవీకరించారు. “ఉగ్రవాదులు కలలో కూడా ఊహించని రీతిలో దాడి చేసి చూపాం. దేశమే ప్రథమం అనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నాం,” అని చెప్పారు.

డ్రోన్లు, మిస్సైళ్లతో మూర్తిమత్వం కలిగిన ప్రతీకారం

భారత్ పాకిస్తాన్‌లోని బహవల్‌పూర్, మురీద్ వంటి ప్రాంతాల్లో ఉన్న ఉగ్రవాద హెడ్‌క్వార్టర్లపై డ్రోన్లు, మిస్సైళ్లతో దాడులు జరిపిందని ప్రధాని తెలిపారు. “ప్రపంచ ఉగ్రవాదానికి ఇవే కేంద్రాలు. అందుకే భారత్ ఈ మూలాలను ధ్వంసం చేసింది,” అని అన్నారు.

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Chandrababu: భారతీయుల బ్లడ్ లోనే బిజినెస్ లక్షణాలు ఉన్నాయి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *