Pm modi: బీహార్ అసెంబ్లీ ఫలితాల నేపథ్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ట్విట్టర్/మీడియా ద్వారా స్పందిస్తూ ఈ విజయాన్ని ప్రజాస్వామ్యానికి అంకితం చేశారు. ప్రజలు ఎన్డీఏపై చూపిన నమ్మకానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ, బీహార్ అభివృద్ధికి ఇచ్చిన తీర్పు చారిత్రాత్మకమని అన్నారు.
ప్రధాని మోదీ పేర్కొన్న ముఖ్య అంశాలు ఇలా ఉన్నాయి:
బీహార్లో ఎన్డీఏ సాధించిన విజయాన్ని “అతి గొప్ప విజయం”గా అభివర్ణించిన మోదీ, ప్రతిపక్షాలు ప్రచారం చేసిన అబద్ధాలను ప్రజలు తిరస్కరించారని స్పష్టం చేశారు. బీహార్ అభివృద్ధి, శాంతి, స్థిరత్వం కోసం ప్రజలు ధృఢంగా ఓటేసారని ఆయన తెలిపారు. ఈ ఎన్నికల్లో బీహార్ ప్రజలు ఎన్నో రికార్డులను బద్దలు కొట్టారని, ఈ విజయాన్ని జేపీ నారాయణ్కు అంకితం చేస్తున్నట్లు వెల్లడించారు.
కొంతమంది MY ఫార్ములాతో (ముస్లిం–యాదవ్) గెలవాలని చూశారని, కానీ తమ MY ఫార్ములా ‘మహిళలు – యూత్’ అని మోదీ వ్యాఖ్యానించారు. ఈ రెండు వర్గాలే ఎన్డీఏకు ఘన మద్దతు ఇచ్చి ఈ విజయాన్ని సాధ్యంచేశాయని అన్నారు.
నితీష్ కుమార్ నేతృత్వంలో అద్భుతమైన ఫలితం వచ్చినందుకు ఆయన ప్రశంసలు తెలిపి, भाजपा–జేడీయూ–ఎన్డీఏ కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. అలాగే జమ్మూ, ఒడిశాలో విజయం సాధించిన BJP అభ్యర్థులకు అభినందనలు తెలిపారు.
ఈ ఎన్నికల ఫలితాలతో ప్రజల్లో ఎన్నికల సంఘం (EC)పై విశ్వాసం మరింత పెరిగిందని మోదీ అభిప్రాయపడ్డారు. ఒకప్పుడు బిహార్లో అరాచక శక్తులు, ఈవీఎంల లూటీలు, పోలింగ్ అడ్డంకులు ఉండేవని, అయితే ఇప్పుడు ప్రశాంత వాతావరణంలో ప్రజలు స్వేచ్ఛగా ఓటు వేసే పరిస్థితి నెలకొచ్చిందని గుర్తుచేశారు.
ఈసారి బీహార్ ఎన్నికలు సుదీర్ఘ కాలం తర్వాత అత్యంత శాంతియుతంగా జరిగాయని ప్రధాన మంత్రి వివరించారు. SIR (స్కిల్, ఇన్వెస్ట్మెంట్, రీఫార్మ్స్) విధానాలకు బీహార్ ఓటర్లు మద్దతు ఇచ్చారని, ఇది అభివృద్ధి మార్గంలో రాష్ట్రం ముందుకు సాగుతుందనే సంకేతమన్నారు.
మోదీ చివరగా ఈ ఫలితం ప్రజాస్వామ్య విజయం, అభివృద్ధిపై ప్రజల నమ్మకానికి ప్రతీక అని వ్యాఖ్యానించారు.

