Delta Plane Crashes: కెనడాలోని పియర్సన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రమాదం జరిగింది . డెల్టా ఎయిర్లైన్స్ చెందిన విమానం ల్యాండింగ్ సమయంలో కూలిపోయింది. నిజానికి, విమానం ల్యాండింగ్ కోసం కిందకు దిగిన వెంటనే, నేల మీద ఉన్న మంచు కారణంగా విమానం బోల్తా పడింది.
19 మందికి గాయాలు, పలువురి పరిస్థితి విషమం
ఈ ప్రమాదంలో 19 మంది గాయపడగా, వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. మిన్నియాపాలిస్ నుండి వచ్చిన డెల్టా విమానంలో “సంఘటన” జరిగిందని విమానంలో 76 మంది ప్రయాణికులతో పాటు నలుగురు సిబ్బంది గాయపడ్డారని విమానాశ్రయం సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ అయినా X లో ధృవీకరించింది.
ఇది కూడా చదవండి: TTD: తిరుమల వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్.. రేపే ఆ టికెట్లు విడుదల.. త్వరపడండి..
ఈ ప్రమాదంలో ఎనిమిది మందికి గాయాలు అయ్యాయి..
ఈ ఘటనలో (కెనడా డెల్టా ఎయిర్లైన్స్ విమాన ప్రమాదం ) ఎనిమిది మంది గాయపడ్డారని పోలీసులు తెలిపారు. గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని, మిగిలిన ఏడుగురికి స్వల్ప గాయాలయ్యాయని పేర్కొన్నారు.
మిన్నియాపాలిస్ నుండి వచ్చిన ఈ విమానంలోని అందరు ప్రయాణీకులు సిబ్బందిని సురక్షితంగా తరలించారు. ABC న్యూస్తో వచ్చిన సమాచారం ప్రకారం, విమానం పల్టీలు కొట్టడానికి తర్వాత మంటలు చెలరేగడానికి గల కారణాలతో సహా, ప్రమాదానికి గల కారణాలను ఇంకా పరిశీలిస్తున్నారు.
అందరూ సురక్షితంగా ఉన్నారు
క్రాష్ ల్యాండింగ్ తరువాత, టొరంటో పియర్సన్ అంతర్జాతీయ విమానాశ్రయం వాళ్ళు తెలిపిన దాని ప్రకారం, సంఘటన జరిగిన వెంటనే అత్యవసర బృందాలు సహాయక చర్యలకు స్పందించాయని తెలిపింది.
ట్విట్టర్లో ఒక పోస్ట్ను షేర్ చేస్తూ ఎయిర్లైన్ ఇలా రాసింది, “మిన్నియాపాలిస్ నుండి వస్తున్న డెల్టా ఎయిర్లైన్స్ విమానం ల్యాండింగ్ సమయంలో జరిగిన సంఘటన గురించి టొరంటో పియర్సన్కు తెలుసు. అత్యవసర బృందాలు స్పందిస్తున్నాయి. ప్రయాణికులు సిబ్బంది అందరినీ సురక్షితంగా తరలించారు.
Here pic.twitter.com/3tAwjYGuVZ
— Bir Acayip Adam (@Tr19192) February 17, 2025
