PCB: పాకిస్తాన్ క్రికెట్ బోర్డు లో రూ.600 కోట్లకు పైగా అవినీతి

PCB: పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)లో భారీ ఆర్థిక అవినీతి, అక్రమ నియామకాలు వెలుగుచూశాయి. 2023–24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆడిట్‌లో రూ.600 కోట్లకుపైగా అవకతవకలు జరిగినట్టు ఆడిటర్ జనరల్ ఆఫ్ పాకిస్తాన్ వెల్లడించారు. ఈ ఆడిట్ రిపోర్ట్‌లో పీసీబీ ఆర్థిక వ్యవహారాల్లో పారదర్శకత లోపించిన విషయాలు స్పష్టమయ్యాయి.

ఆడిట్ వివరాల ప్రకారం, టికెట్ కాంట్రాక్టులు, మీడియా హక్కులు, ప్రసార ఒప్పందాలను నిబంధనలు పాటించకుండా కేటాయించినట్లు గుర్తించారు. రూ.500 కోట్ల విలువైన స్పాన్సర్‌షిప్ మొత్తాన్ని రికవరీ చేయడంలో విఫలమయ్యారని పేర్కొన్నారు. అదేవిధంగా, రూ.43.9 కోట్ల విలువైన మీడియా హక్కులను రిజర్వ్ ధర కంటే తక్కువ ధరకు కేటాయించారని ఆడిట్ స్పష్టం చేసింది.

భద్రత కోసం పోలీసులకు భోజన ఖర్చుల పేరుతో రూ.6.3 కోట్లు ఖర్చు చేయడం అనవసరమైనదిగా గుర్తించబడింది. మ్యాచ్ అధికారులకు అదనంగా రూ.38 లక్షలు చెల్లించడాన్ని కూడా అక్రమంగా పేర్కొన్నారు. అలాగే, మీడియా డైరెక్టర్‌ను నెలకు రూ.9 లక్షల జీతంతో నియమించడం కూడా అనుమానాస్పదమైన నియామకంగా పేర్కొన్నారు.

మరియు, 2023 ఫిబ్రవరి నుంచి 2024 జూన్ వరకు పీసీబీ చైర్మన్‌కు యుటిలిటీస్, ఇంధనం, వసతి ఖర్చుల కింద రూ.41 లక్షలు చెల్లించారని రిపోర్ట్‌ వెల్లడించింది. ఇవి చట్టవిరుద్ధంగా పాక్ హోం మంత్రిగా ఉన్న మోహిసిన్ నక్వీకి లబ్ధి కలిగించినట్లు పేర్కొన్నారు.

ఈ ఆడిట్ నివేదిక ద్వారా పీసీబీలో కొనసాగుతున్న రాజకీయ జోక్యం, అక్రమాలకు సంబంధించి మరోసారి చర్చ ప్రారంభమైంది. ఒకప్పుడు అంతర్జాతీయ క్రికెట్‌లో ప్రముఖంగా గుర్తింపు పొందిన పాకిస్తాన్ జట్టు, ఇటీవలి కాలంలో ఆర్థిక మరియు నిర్వాహక సమస్యలతో తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది. తాజా నివేదికతో పీసీబీపై విమర్శలు మళ్లీ ముదురుతున్నాయి.

 

 

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  KTR: ఎవ్వడికి భయపడను..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *