Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా వారికి నివాళులు అర్పించారు. ఎక్స్ వేదికగా ఆయన స్పందిస్తూ, విధి నిర్వహణలో తమ ప్రాణాలను త్యాగం చేసిన వీర పోలీసు సైనికులకు హృదయపూర్వక నివాళులు అర్పిస్తున్నానని తెలిపారు.
పోలీసుల సేవలు, త్యాగం గొప్పది:
శాంతి భద్రతల కోసం పగలు రాత్రి తేడా లేకుండా కష్టపడుతున్న పోలీసు సిబ్బందిని ఆయన ఈ సందర్భంగా అభినందించారు. పోలీసుల చేసిన త్యాగం మరియు వారి నిస్వార్థ సేవ రాబోయే తరాలకు కూడా ప్రేరణగా నిలుస్తుందని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.
ప్రజల భద్రత, చట్టాలను కాపాడటం, శాంతిని పరిరక్షించడం వంటి పనుల్లో పోలీసులు ఏమాత్రం వెనకాడకుండా, నిరంతరం పనిచేస్తున్నారని ఉప ముఖ్యమంత్రి కొనియాడారు.
ప్రణాళికాబద్ధమైన కృషి:
ముఖ్యంగా, నేరాల సంఖ్యను తగ్గించడంలో పోలీసులు అనుసరించే ప్రణాళిక మరియు ప్రజల ప్రయోజనంపై వారు దృష్టి పెట్టే విధానం మెచ్చుకోదగినది అని పవన్ కళ్యాణ్ తెలిపారు.
విధుల పట్ల అంకితభావంతో పనిచేసే పోలీసుల త్యాగాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా పోలీసుల సేవలను స్మరించుకుందామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు.
On the occasion of Police Commemoration Day, I pay my heartfelt tributes to all the brave police martyrs who made the supreme sacrifice in the line of duty, safeguarding peace, harmony, and the lives of citizens with utmost dedication and courage. Their selfless service and… pic.twitter.com/8hMDDboV15
— Deputy CMO, Andhra Pradesh (@APDeputyCMO) October 21, 2025