Pawan Kalyan

Pawan Kalyan: చేవెళ్ల బస్సు ప్రమాదంపై.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ తీవ్ర దిగ్భ్రాంతి

Pawan Kalyan: తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా, చేవెళ్ల మండలంలోని మీర్జాపూర్ వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆర్టీసీ బస్సును కంకర టిప్పర్ ఢీకొట్టడం వల్ల 24 మంది అమాయక ప్రయాణికులు చనిపోయారని తెలిసి తాను చాలా బాధపడ్డానని ఆయన తెలిపారు. మరణించిన వారి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నట్లు పవన్ కళ్యాణ్ అన్నారు.

గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలి: పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి
ఈ ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ముఖ్యమంత్రి కార్యాలయం ఈ విషయాన్ని నిశితంగా పరిశీలిస్తుందని, మృతుల కుటుంబాలకు అండగా ఉండాలని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ప్రమాదం రాష్ట్రంలోనే కాక, రెండు తెలుగు రాష్ట్రాలలోనూ విషాద వాతావరణాన్ని నింపిందని ఆయన అన్నారు. మరణించిన వారి ఆత్మకు శాంతి కలగాలని ఆయన ప్రార్థించారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *